టికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావు
ఎన్నికలు తెలుగు గడ్డ కోసమా..? నిమ్మగడ్డ కోసమా?
25 Jan 2021 11:29 AM
ఎంపీ బాలశౌరీ
తాడేపల్లి: ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు తొందర ఎక్కువైందని వైయస్ఆర్సీపీ ఎంపీ బాలశౌరీ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలు తెలుగు గడ్డ కోసమా? నిమ్మగడ్డ కోసమా అని ఆయన ప్రశ్నించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద బాలశౌరి మీడియాతో మాట్లాడారు. నిమ్మగడ్డ రమేష్కుమార్కు ప్రాణాలపై భీతితో మీడియా సమావేశంలో గ్లాస్ ఏర్పాటు చేసుకొని జాగ్రత్తగా వ్యవహరించారని, ఆయన మాదిరిగానే అధికారులు, ప్రజలకు ప్రాణభయం ఉండదా అని ప్రశ్నించారు. ఇటీవల కోర్టు విచారణకు కూడా నిమ్మగడ్డ వర్చువల్ విధానంలో హాజరయ్యారని గుర్తు చేశారు. ఫ్రంట్లైన్ వారియర్స్కు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ ..హడావుడిగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ప్రజలు, ఉద్యోగులు తమ ప్రాణాలు ముఖ్యమని అంటున్నారు. నిమ్మగడ్డ, చంద్రబాబు, నారా లోకేష్ మాత్రం హైదరాబాద్లో ఉంటారని, వీరికి ఏపీలో ఎన్నికలు కావాలా అని నిలదీశారు. ఎన్నికలపై నిమ్మగడ్డకు తొందరెందుకని ప్రశ్నించారు. చంద్రబాబు కోసం నిమ్మగడ్డకు తొందర ఎక్కువైందని, ఆయన స్పీడ్ తగ్గించుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.