మంచి చేసే ముఖ్యమంత్రి మన వైయ‌స్ జగన్

  మోహన్‌బాబు

 హైదరాబాద్‌ : ప్రజల తీర్పు ఎప్పుడూ గొప్పదేనని, సీనియర్‌ నటుడు, వైయ‌స్ఆర్‌సీపీ నేత మంచు మోహన్‌బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభంజనం సృష్టించడంతో ఆయన ఓ పత్రికప్రకటనను విడుదల చేశారు. దివంగత మహానేత వైయ‌స్‌ రాజశేఖర రెడ్డి తన బిడ్డ జగన్‌ మోహన్‌రెడ్డికి ధైర్య సాహసాలతో పాటు ఆశీస్సులు ఇచ్చారన్నారు. వైయ‌స్‌ జగన్‌ 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారని, దీంతో ప్రజలు ఆశీస్సులు అందజేసి ముఖ్యమంత్రిని చేశారన్నారు. కచ్చితంగా ప్రజలకు జగన్‌ మేలు చేస్తారని, మంచి చేసే ముఖ్యమంత్రి మన జగన్‌ అని అభివర్ణించారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల్లో వైయ‌స్ఆర్‌సీపీ 150 సీట్ల ఆధిక్యంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే

 
 

 

Back to Top