ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు

ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కుమార్ 

ఎచ్చెర్ల‌:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌లో ప్ర‌తి గ‌డ‌ప‌కు సంక్షేమ ఫ‌లాలు అందిస్తున్నామ‌ని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కుమార్ పేర్కొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం రణస్థలం 1గ్రామ సచివాలయం పరిధిలోని రణస్థలం గ్రామంలో "గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం"లో భాగంగా గురువారం ఉదయం 6:02గంటల నుంచి 10:05గంటల వరకు 177వ రోజు 257 గడపల ప్రజలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ క‌లిశారు. ప్ర‌తి ఇంటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను -పనితీరును వివరించారు.
ఈ సందర్భంగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాల ఫలాలు అందాయని,అర్హులైన ప్రతి ఒక్కరికి నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే సంక్షేమ పథకాల లబ్ధి అందేలా ప్రభుత్వం పనిచేసిందన్నారు.గతంలో సంక్షేమానికి తూట్లు పొడిచి జన్మభూమి కమిటీలకు అధికారాలు అప్పజెప్పి ఇంటిపై జెండా కడితేనో లేదా పార్టీ కండువా కప్పుకుంటేనో సంక్షేమ పథకాలు ఇచ్చే వారిని,కానీ నేడు తెలుగుదేశం పార్టీ వారికి కూడా అర్హులు అయితే చాలు సంక్షేమ పథకాలను వైయస్ జగన్ ప్రభుత్వం ఇస్తుందన్నారు.సంక్షేమ పథకాల అమలుతో పాటు విద్యా -వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తూ ఆయా రంగాల్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి ప్రజలకు మరింత మేలు చేకూరేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారన్నారు.పేద కుటుంబాలకు కూడా నాణ్యమైన ఉచిత విద్య,మెరుగైన ఉచిత వైద్యం అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు.అర్హత కలిగిన ఎవరికైనా సంక్షేమ పథకాలు అందకపోతే స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకొని లబ్ధిని పొందాలని సూచించారు.
 కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి,రణస్థలం మండలం ఎంపీపీ ప్రతినిధి పిన్నింటి సాయికుమార్, ఎచ్చెర్ల మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రతినిధి లంకలపల్లి ప్రసాద్, జడ్పీటీసీ టొంపల సీతారాం, మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెద్దరామునాయుడు, జే.సి.యస్ మండల ఇంచార్జి చిల్ల వెంకటరెడ్డి,వైస్ ఎంపీపీ రాయపురెడ్డి బుజ్జి, నాయకులు గొర్లె అప్పలరనర్సు నాయుడు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పిల్ల ఆనంద్ పాత్రుడు, మహిళా అధ్యక్షురాలు గురాన మానస, తదితరులు పాల్గొన్నారు.

Back to Top