బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ఆర్యవైశ్యులపై చంద్రబాబుది కపట ప్రేమ
17 Mar 2022 10:08 AM
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
అమరావతి: ఆర్యవైశ్యులపై చంద్రబాబు కపట ప్రేమ చూపుతున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. గురువారం సభలో మంత్రి మాట్లాడుతూ..చంద్రబాబుది అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు మరోమాట అని మండిపడ్డారు. చంద్రబాబుకు పొట్టి శ్రీరాములు నిన్నే గుర్తుకువచ్చారన్నారు. ఆర్యవైశ్యులను చులకనగా చూసి అవమానించింది చంద్రబాబే అన్నారు. ఆర్యవైశ్యులపై పవన్ కళ్యాణ్ కపట ప్రేమ చూపిస్తున్నారని తెలిపారు. రోశయ్యను ఏడిపించిన వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు.
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంకా ఏమన్నారంటే..
చంద్రబాబుకు అమరజీవి పొట్టి శ్రీరాములు నిన్ననే గుర్తుకు వచ్చినట్టుంది. ఆర్యవైశ్యులపై బాబు కపట ప్రేమ చూపుతున్నాడు. చంద్రబాబు అధికారంలో ఉంటే తోలు తీస్తాను అంటాడు.. ప్రతిపక్షంలో ఉంటే, అందరికీ తోడుగా, అండగా ఉంటాను అని స్టేట్ మెంట్లు ఇవ్వడం ఆయనకు పరిపాటి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న ఆర్య వైశ్యుడు మల్లికార్జునరావును పిలిపించి ఆయన భార్య శ్రీదేవికి మాచర్ల చైర్మన్ పదవి ఇచ్చినట్టే ఇచ్చి, తీరా, తన సామాజికవర్గం కోసం, పదవి ఇచ్చిన ఏడాది నుంచే రాజీనామా చేయమని ఒత్తిడి చేసి, ఆమె చేత రాజీనామా చేయించబట్టే కదా ఆ భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నది అని అడుగుతున్నాం.
చిలకలూరిపేటలో శంకర్ అనే విలేకరిని టీడీపీ హయాంలో హత్య చేయించింది వాస్తవం కాదా..? అలానే, మంత్రిగా పనిచేసిన సిద్దా రాఘవరావును బలవంతంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించి, ఆయన ఓటమికి కారణం అయింది టీడీపీ కాదా.. ?. సినీ నటి కవితను ఏడిపించి బయటకు పంపలేదా..? ఆర్యవైశ్యులను అడుగడుగునా చులకనగా చూసిందీ, అవమానించిందీ చంద్రబాబే.
అమరజీవి పొట్టి శ్రీరాములుని అవమానిస్తూ, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవనిర్మాణ దీక్షగా మార్చింది చంద్రబాబు కాదా.. ?. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే, నవంబర్ 1ని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించింది వాస్తవం. రోశయ్య వాసవి సత్రాలను ఆర్యవైశ్యులకు ఇస్తే వాటిని టీడీపీ తీసుకోలేదా..? . రోశయ్యని ఏడిపించిన వ్యక్తి చంద్రబాబే. ఆర్యవైశ్యులపై పవన్ కల్యాణ్ కూడా కపట ప్రేమ చూపిస్తున్నాడు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణిస్తే.. మూడు రోజులు సంతాప దినాలుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రకటించారు. ముగ్గురు మంత్రులను అంత్యక్రియలకు పంపారు. ఆయన ఆస్తికలు కలపడానికి కూడా మంత్రులను పంపారు.