వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఏపీని అప్పుల ఊబిలో నెట్టింది చంద్రబాబే
25 Nov 2019 4:03 PM
బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్నారాయణ
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత చంద్రబాబుదేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్నారాయణ అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనలో రాష్ట్రం బాగుపడుతుంటే అది చూసి ఓర్వలేక చంద్రబాబు, లోకేష్ అవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అనంతపురంలో మంత్రి శంకర్నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలల్లోనే మేనిఫెస్టోలోని అంశాలను 80 శాతం అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్కే దక్కుతుందన్నారు. సంక్షేమ పథకాల అమలు చూసి చంద్రబాబు, పవన్ తట్టుకోలేకపోతున్నారన్నారు. దత్తపుత్రుడు పవన్ కూడా చంద్రబాబు బాటలోనే నడుస్తున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ పాలనలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.