చంద్ర‌బాబు బీసీల ద్రోహి

బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంక‌ర్ నారాయ‌ణ‌
 

అమ‌రావ‌తి:  టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల ద్రోహి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంక‌ర్ నారాయ‌ణ మండిప‌డ్డారు.  వెనుకబడిన వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్ స్పీకర్ అయితే ఆయన్ను కుర్చీవరకూ తీసుకెళ్లేందుకు కూడా చంద్రబాబు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మొదటినుంచి బీసీలను ఓటు బ్యాంకుగానే చూసిందనీ, కానీ వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ మాత్రం ఇచ్చిన హామీకి కట్టుబడి బీసీలకు పదవులు ఇచ్చారని వ్యాఖ్యానించారు.  సీఎం వైయ‌స్ జగన్  బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకే 60 శాతం పదవులు కేటాయించారని పేర్కొన్నారు. రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏటా రూ.10 వేలు ఇవ్వాలన్న ఫైలుపై తాను తొలి సంతకం పెట్టాననీ, వచ్చే కేబినెట్ భేటీలో దీని విధివిధానాలను ఖరారు చేసి అమలు చేస్తామని పేర్కొన్నారు.
 

Back to Top