చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
చంద్రబాబు బీసీల ద్రోహి
15 Jun 2019 3:46 PM
బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు బీసీల ద్రోహి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ మండిపడ్డారు. వెనుకబడిన వర్గానికి చెందిన తమ్మినేని సీతారామ్ స్పీకర్ అయితే ఆయన్ను కుర్చీవరకూ తీసుకెళ్లేందుకు కూడా చంద్రబాబు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ మొదటినుంచి బీసీలను ఓటు బ్యాంకుగానే చూసిందనీ, కానీ వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మాత్రం ఇచ్చిన హామీకి కట్టుబడి బీసీలకు పదవులు ఇచ్చారని వ్యాఖ్యానించారు. సీఎం వైయస్ జగన్ బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనారిటీలకే 60 శాతం పదవులు కేటాయించారని పేర్కొన్నారు. రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఏటా రూ.10 వేలు ఇవ్వాలన్న ఫైలుపై తాను తొలి సంతకం పెట్టాననీ, వచ్చే కేబినెట్ భేటీలో దీని విధివిధానాలను ఖరారు చేసి అమలు చేస్తామని పేర్కొన్నారు.