శ్రీకాకుళం: తిత్లీ తుపాన్తో ఉద్దానం రెండు తరాల వెనక్కి వెళ్లిపోయిందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఉద్దానం పునర్ నిర్మాణం సదస్సులో మంత్రి కృష్ణదాస్ పాల్గొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రైతాంగం త్వరగా కోలుకునేందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారానికి అదనంగా పరిహారం ఇచ్చామని గుర్తుచేశారు. ఉద్దానం త్వరగా కోలుకునేందుకు ఎంత సాయం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.