వైయ‌స్ఆర్‌సీపీ వేసిన విత్త‌న‌మే డేటా సెంట‌ర్‌ 

క్రెడిట్‌ చోరీలో చంద్రబాబు పీక్‌.. పర్ఫార్మెన్స్‌ వీక్‌

వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స్ప‌ష్టం

ఏపీలో 2020లో  అదానీ డాటా సెంటర్‌ ఒప్పందానికి బీజం 

2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్‌కు శంకుస్థాపన కూడా చేశాం

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్‌ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది

వైజాగ్‌లో అదానీ ఇన్‌ఫ్రాకు చెందిన కంపెనీలే గూగుట్‌ డాటా సెంటర్‌ని నిర్మిస్తున్నాయి

చంద్ర‌బాబు రాష్ట్రాన్ని యాడ్‌ ఏజెన్సీలా నడిపిస్తున్నారు 

వైయ‌స్ఆర్ వ‌ల్లే హైద‌రాబాద్ రాత  మారింది

హైదరాబాద్‌ అభివృద్ధికి చంద్రబాబుకు అసలు సంబంధమే లేదు

ప్రభుత్వం ఉద్యోగులకు చంద్ర‌బాబు మోసం

ఉద్యోగులకు జీపీఎస్‌ లేదు.. ఓపీఎస్‌ లేదు.

జీతాలు పెంచాల్సి వస్తుందని పీఆర్సీ గురించి మాట్లాడ‌కుండా డైవర్ట్‌ చేస్తూ దీపావళి సంబురాలు  
 

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ వేసిన బీజానికి కొనసాగింపే విశాఖ గూగుట్‌ డాటా సెంటర్‌ అని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ క్లారిటీ ఇచ్చారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం, అదానీ, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్‌ ప్రభుత్వాల సమిష్టి కృషి ఇది అని చెప్పుకొచ్చారు. 2023లోనే డాటా సెంటర్‌కు శంకుస్థాపన కూడా చేశామని వెల్లడించారు. క్రెడిట్‌ చోరీలో చంద్రబాబు పీక్‌.. పర్ఫార్మెన్స్‌ వీక్‌ అని సెటైరికల్‌ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని యాడ్‌ ఏజెన్సీలా నడిపిస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆయ‌న ఏమ‌న్నారంటే..

మొదటి సబ్జెక్ట్ నకిలీ మద్యంలో జరుగుతున్న డ్రామాలు
రాష్ట్రంలో నిజంగా గమనిస్తే వ్యవస్థీకృత ఇల్లిసిట్ స్పూరియస్ మద్యం అన్నది వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు అమ్ముడుకాబడుతున్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ రకమైన మాఫియా ప్రపంచ చరిత్రలో ఎక్కడా చూసి ఉండం. 

ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. నకిలీ మద్యం తయారు చేస్తున్న మద్యాన్ని వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా.. ఈరోజు గవర్నమెంట్లో షాపులు నడుపుతున్న వారందరూ కూడా ఏరకంగా వారికి షాపులు వచ్చాయి.. ఏరకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మనుషులు ఏరకంగా షాపులు నడుపుతున్నారు.. ఇదేరకమైన మాఫియా అనేది మనందరి తెలిసిన విషయమే. మద్యాన్ని వాళ్లే తయారు చేస్తున్నారు.. ఈ ప్రైవేట్ మాఫియా షాపుల ద్వారానే మద్యాన్ని వాళ్లే అమ్ముతున్నారు. వాళ్ల బెల్ట్ షాపుల ద్వారా కూడా విక్రయాలు జరుపుతున్నారు. గ్రామాల్లో ఏకంగా ఆక్షన్ వేసి బెల్ట్ షాపులు స్థాపింపజేసి, వాటికి పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి, ఆ పోలీస్ ప్రొటెక్షన్ ఆధ్వర్యంలో గ్రామాల్లో మద్యం అమ్మేందుకు ఈ మాఫియా శ్రీకారం చుట్టి, ఆ బెల్ట్ షాపుల ద్వారా కూడా నకిలీ మద్యం అమ్ముతున్నారు. బెల్ట్ షాపులే కాకుండా ఏకంగా ఇల్లీగల్ పర్మిట్ రూమ్ ల ద్వారా కూడా కల్తీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రభుత్వ ఖాజానాకు వేల కోట్ల రూపాయల నష్టం కలిగిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ, వీళ్ల సొంత జేబులు నింపుకునేందుకు ఏ స్థాయికైనా దిగజారిపోయి, ఈ రోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. నకిలీ మద్యం తయారు చేసి, విచ్చలవిడిగా విక్రయాలు జరుపుతూ దొరికిపోయిన వైనాన్ని మనం గమనించాం. 

వాటాల్లో తేడా రావడంతో ఇదంతా బయటకు వచ్చింది. ఒక్క మొలకలచెరువులోనే 20,208 బాటిళ్లలో నింపిన నకిలీ సరుకు దొరికింది. మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని కూడా పట్టుకున్నారు. అంతటితో ఆగిపోలేదు.. 30 క్యాన్లలో సిద్ధం చేసి ఉన్న 1050 లీటర్ల స్పిరిట్ కూడా అక్కడ లభ్యమైంది. ఇవన్నీ కూడా వాడుకుంటే మరికొన్ని వేల బాటిళ్లు కల్తీ మద్యం తయారై మనందరికీ కనిపించేది. 

మొలకలచెరువు నుంచి కాస్త ముందుకు వస్తే.. 
విజయవాడలో, ఎక్కడైతే సీపీ పర్యవేక్షణలో పోలీసులు పనిచేస్తున్నారో.. ఏ పోలీస్ కమిషనర్ అయితే చంద్రబాబు అడుగులకు మడుగులు ఒత్తుతున్నాడో.. ఏ పోలీస్ కమిషనర్ అయితే సిట్ పేరుతో గతంలో ఏమీ జరగకపోయినా కూడా తప్పుడు సాక్ష్యాలతో మా పార్టీ వారిని వేధించే కార్యక్రమాలు చేస్తున్నాడో.. అదే విజయవాడ సీపీ పర్యవేక్షణలో ఉన్న ఇబ్రహీంపట్నంలో మరో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. ఇబ్రహీంపట్నంలో దొరికిన నకిలీ మద్యం దాదాపుగా 27,224 బాటిళ్లు. రాష్ట్రంలో ఇక మిగిలిన చోట్ల అనకాపల్లి జిల్లా పరవాడలో నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడింది. అమలాపురంలో ఇలాగే మద్యం ఫ్యాక్టరీ బయటపడింది.. పాలకొల్లులో ఇలాగే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి.. ఏలూరులో ఇదే మాదిరిగానే మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డాయి.. రేపల్లెలో ఇదే మాదిరిగా  మద్యం ఫ్యాక్టరీ బయటపడ్డాయి.. నెల్లూరులో ఇదే మాదిరిగా నకిలీ మద్యం ఫ్యాక్టరీ బయటపడ్డ పరిస్థితులు మధ్య.. ఈ నకిలీ మద్యం తయారీని మొత్తం కూడా పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో కొన్ని లక్షల బాటిళ్లు తయారు చేసేదీ వీళ్లే.. డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్ ద్వారా వీళ్లకు సంబంధించిన ప్రైవేట్ మాఫియా షాపుల్లోకి, వీళ్లకు సంబంధించిన బెల్ట్ షాపులకు, వీళ్లకు సంబంధించిన ఇల్లీగల్ పర్మిట్ రూమ్ లకు అన్నింటికీ వీళ్లే డిస్ట్రిబ్యూట్ చేసి అమ్ముతున్నారు. 
(నకిలీ మద్యం తయారీ ఫ్యాక్టరీ, మద్యం బాటిళ్ల ఫొటోల ప్రదర్శన)
1.అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మొలకలచెరువు ఫ్యాక్టరీలో లభ్యమైన నకిలీ మద్యం బాటిళ్లు
2. అన్నమయ్య జిల్లా ఫ్యాక్టరీలో మెషీన్లకు పూజా చేసి మరీ నకిలీ మద్యం పకడ్బందీగా చేస్తున్నారు. 
3. ఏకంగా బాటిళ్లు, స్టాంప్స్, లేబుళ్లు. అన్నీ నీటుగా అమర్చడం, ప్యాకింగ్ చేయడం, ప్యాకింగ్ బ్యాగ్స్ కూడా.. రకరకాల బ్రాండ్స్. 
4. ఇబ్రహీపట్నంలో నకిలీ మద్యం ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీలో దొరికిన నకిలీ మద్యం మెటీరియల్
5. రకరాల బ్రాండ్స్.. కేరళ మాల్ట్, ఓల్డ్ అడ్మిరల్, మంజీరా బ్లూ, క్లాసిక్ బ్లూ, ఇంకో బాటిల్కు లేబుల్ అంటించలేదు. 
6. అద్దేపల్లి జనార్దనరావు ఏఎన్.ఆర్ రెస్టారెంట్ అండ్ బార్.. షాపులకు పేర్లు కూడా బాగా పెడుతున్నారు. ఒకరు నాగేశ్వరరావు గారి పేరు, ఇంకొకరు ఎన్టీ ఆర్ పేరు పెడుతున్నారు. 
7. ఇది పరవాడలో.. అనకాపల్లి జిల్లా పరవాడలో చిన్న సైజ్ నకిలీ మద్యం ఫ్యాక్టరీ. సేమ్.. స్టిక్కర్లు, లేబుళ్లు, బాటిళ్లు, మ్యానిఫ్యాక్చరింగ్. పరవాడలో నకిలీ మద్యం తయారు చేస్తున్నది ఎవరంటే.. నకిలీ మద్యం తయారీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సన్నిహితుడు రుత్తల రాము. 
8. అమలాపురంలో పట్టుబడిన నకిలీ మద్యం బాటిళ్లు, మెషీన్. కాటన్లు, లేబుళ్లు.
9. పాలకొల్లులో నకిలీ మద్యం తయారీ గుట్టుకు సంబంధించి
10. ఏలూరులో నకిలీ మద్యం,
11. రేపల్లెలో నకిలీ మద్యం తయారీ
12. నెల్లూరులో నకిలీ మద్యం తయారీ (ఫొటోల ప్రదర్శన)

ఇలా కొన్ని లక్షల బాటిళ్లు రోజూ. ప్రతి నాలుగైదు బాటిళ్లకు ఒక బాటిల్ ఈ కల్తీ మద్యం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా లిక్కర్ మాఫియా షాపుల్లో, వాళ్ల బెల్ట్ షాపుల్లో, వాళ్ల ఇల్లీగల్ పర్మిట్ రూంలలో.. ప్రతి నాలుగైదు బాటిళ్లకు ఒక బాటిల్ నకిలీ మద్యాన్ని అమ్మతున్నారు. 

నిజంగా ఏ స్థాయిలో ఈ మాఫియా నడుస్తుందంటే.. ఇంత ఆర్గనైజ్డ్ గా మ్యానిఫ్యాక్చర్ చేయడం, ఆర్గనైజ్డ్ గా డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అన్నీ వీళ్ల కంట్రోల్ లోకి తీసుకోవడం, వాటి ద్వారా మార్కెటింగ్ చేయడం. ఇంత ఆర్గనైజ్డ్ గా క్రైమ్ చేయడం ఒక్క చంద్రబాబు నాయుడుకు మాత్రమే సొంతం. ఆయన కొడుకు కూడా ఏమాత్రం తక్కువ తిన్నోడు కాదు. వాళ్లిదరికి మాత్రమే సొంతం. 

దీని నుంచి డైవర్ట్ చేయడానికి.. రెండు సంవత్సరాలు అయిపోయింది వీళ్లే అధికారంలో ఉన్నారు. రెండు సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమం చేస్తున్నారు. రెండు సంవత్సరాల నుంచి చేస్తున్న ఈ కార్యక్రమంలో డబ్బుల దగ్గర తగాదాలు వచ్చి బయటపడడంతో టాపిక్ డైవర్ట్ చేయడానికి.. చంద్రబాబు చేస్తున్న కుట్రలు.. ఆయనకు డైవర్షన్ పాలిటిక్స్ అలవాటే. ఎన్టీ ఆర్ ను వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి ఆయన ఫ్లాష్ బ్యాక్ అంతా తిరిగి చూస్తే.. చేసేది ఆయనే, నెపాన్ని వేరేవాళ్ల మీదకు నెట్టేది ఆయనే.. దానికి వత్తాసు పలికేది ఇదే ఎల్లో మీడియానే.. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా.. ఇదే మోడస్ ఆపరెండా..

చంద్రబాబే నేరాలు చేస్తడు.. అది బయటపడే సరికి ప్రజలను తప్పుదోవపట్టించేందుకు ఆయన దొంగలముఠా ఎల్లో మీడియా సిద్ధం అవుతుంది. అంతా ఆర్కెస్ట్రేటెడ్ గా, ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి నమ్మించడం కోసం.. చెప్పిన అబద్ధమే వందసార్లు చెప్పే కార్యక్రమం.

టాపిక్ డైవర్షన్ లో భాగంగా ఎదుటివారిపై వారే బురదజల్లుతారు. వాళ్లే కొత్త కొత్త ఆరోపణలు చేస్తారు. వాళ్లే ఆ ఆరోపణలను నిజం చేయాలనే తాపత్రయంతో ఒక సిట్ కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు.. తప్పుడు సాక్ష్యాలను క్రియేట్ చేస్తారు.. తప్పుడు డ్రామాను నడుపుతారు. ఇదేంటని పొరపాటున ప్రశ్నిస్తే.. వారిపై కూడా ముద్ర వేసేస్తారు. తప్పుడు ప్రచారం చేస్తూ వారిని కూడా జైళ్లకు పంపించే కార్యక్రమం చేస్తారు. 

నిజంగా కొన్ని కొన్ని కామన్ సెన్సికల్ గా అనిపించే కొన్ని ప్రశ్నలు అడుగుతా.. 
నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉంది చంద్రబాబు మనుషులు. తంబళ్లపల్లె టీడీపీ ఇంచార్జ్, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి జయచంద్రారెడ్డి. చంద్రబాబు ఆయనకు భీఫామ్ ఇచ్చాడు. ఫొటోలో జయచంద్రారెడ్డి పక్కనే ఉన్న రో వ్యక్తి జనార్దనరావు. లోకేష్, చంద్రబాబుతో ఉన్న మరో వ్యక్తి సురేంద్రనాయుడు. ఇదంతా ఒక మాఫియా.

ఎన్నికల్లో బాండ్లు, బాండ్లతో పాటు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో, చంద్రబాబు నాయుడు ఫొటో.. చూడండి ఎంత చక్కగా ప్రతి ఇంటికీ పోయి ఇస్తున్నాడో.

నేను అడుగుతున్నాను. ఇదే జనార్దన్ రావు అనే వ్యక్తి విదేశాల్లో ఉండగానే రెండు రోజుల్లో వచ్చి ఈ మనిషి లొంగిపోతాడంటూ వీళ్లే సుతిమెత్తగా ఎల్లో మీడియాలో లీకులిచ్చారు. ఈనాడులో బాగా కనపడుతుంది. ఆంధ్రజ్యోతిలో బాగా చక్కగా చూపిస్తారు. టీవీ5 బాగా తాళం వేస్తుంది. అంతా హాట్ లైన్ కదా. ఎల్లో మీడియా అంటే దొంగల ముఠా.

దీని సారాంశం ఏమిటంటే ముందుగానే జనార్దన్ రావుతో వీళ్లు మాట్లాడుకోవడం, ఆ వెంటనే ఆ జనార్దన్ రావు రెండున్నర సంవత్సరాల కిందట నుంచే ఈ వ్యవహారం జరుగుతోందని ఆయన నోట్లోంచి అలా చెప్పించడం, దానికి పూర్తిగా ప్లేటు ఫిరాయించి ఆయనతో పూర్తిగా ఒక స్కెచ్ గీయించడం..

సరే అంతటితో అయిపోలేదు, ఒకవైపున ఇది చేస్తుండగానే మరోవైపున తంబళ్లపల్లెలో టీడీపీ ఇన్ చార్జ్ జయచంద్రారెడ్డి మీద ఒక బ్రాండింగ్. ఆయన మా పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడంట. అని బ్రాండింగ్. 

వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టారంట. అని ఇదొక బ్రాండింగ్. మళ్లీ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తానా తందానా. 

ఆశ్చర్యం కలిగించే విషయాలు.. టీడీపీ పార్టీ నుంచి ట్వీట్ చేస్తూ ఇవన్నీ. ఈ వ్యవహారాన్ని ఏకంగా ఆఫ్రికాలో మూలాలు ఉన్నాయంటూ కథ బిల్డప్. 

ఇంకాస్త ముందుకు పోయి ఏమన్నారు... అక్కడితో ఆగిపోకుండా చంద్రబాబు బరితెగించి, అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉందంటే ప్రభుత్వంలో ఉన్న ఐవీఆర్ఎస్ కాల్ సెంటర్ ను ఉపయోగించుకుని తన మాఫియాలో ఒకడైన తన మనిషి జనార్దన్ రావు ఇచ్చిన వీడియోను చూపించి, ఆయన చేత ఒక వీడియోను చేయించి, ఆ వీడియోలో మాజీ మంత్రి జోగి రమేష్ పేరు చెప్పించి, ఆ వీడియోలోని వాయిస్ కు మరికొన్ని వక్రీకరణలు జోడించి, వాటిని ఉధృతంగా ప్రచారం చేయడం. 

ఇంతటితో కూడా ఆగిపోలేదు. ఏబీఎన్, ఈనాడు, టీవీ5 రంగ ప్రవేశం చేశారు. జనార్దన్ రావు అనే వ్యక్తి ఫోన్లో ఛాట్స్ అంట. జోగి రమేష్ తో అని అవి చూపించడం. 

చేసేది వీళ్లే, డైవర్ట్ చేస్తూ ఇంకొకరి మీద బురదజల్లుతూ ఏరకంగా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఏరకంగా జరుగుతోందో. 

నేను చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నా. చెప్పే ధైర్యం తనకుంటే చెప్పమని అడుగుతున్నా. 

నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీలు బయటపడ్డ తర్వాత మీరెన్ని షాపుల్లో తనిఖీలు చేశారు? ఎన్ని నకిలీ లిక్కర్ బాటిళ్లు పట్టుకున్నారు. ఏయే షాపుల్లో గుర్తించారు?

ఒకటీ లేదు. అన్ని షాపులూ వీళ్లవే. పట్టుకుంటే అన్ని చోట్లా దొరుకుతాయి. కాబట్టి ఏవీ చేయరు. 

ఇదే జనార్దన్ రావు విదేశాల నుంచి వస్తున్నప్పుడు, వస్తున్నాడని మీ పేపర్లో మీరే రాశారు. రెండ్రోజుల్లో వస్తున్నాడని. మరి ఆయన్ను ఎందుకు అరెస్టు చేయలేదు? 

మామూలుగా మా వాళ్లు ఎవరు పోయినాగానీ ఎయిర్ పోర్టుల్లో లుక్ అవుట్ నోటీసులు పెడుతున్నారు. ఈయనవి మాత్రం పెట్టరు. దర్జాగా ఆయన వస్తున్నాడు. 

నేను అడుగుతున్నా. మరి ఈ జనార్దన్ రావు అనే మనిషి వీడియోలో ఎలా మాట్లాడగలిగాడు. ఆ వీడియోను ఎలా బయటకు పంపగలిగారు?

ఆశ్చర్యం ఏమిటో తెలుసా? తన ఫోన్ పోయింది అని చెప్పిన జనార్దన్ రావు ఇవన్నీ చేశాడు. 

ఫోన్లో రికార్డింగ్, ఆయన ఆడియో, వీడియో ఆయన మాటలు. ఫోన్ పోయిందని చెబుతున్న ఈ వ్యక్తి దాంట్లో నుంచి బయటకు పంపించడం, దాంట్లో ఛాట్స్ కూడా క్రియేట్ చేయడం..

ఆ ఫోన్ నుంచి తప్పుడు, ఫ్యాబ్రికేటెడ్ స్క్రీన్ షాట్స్ తీయడం ఎలా సాధ్యం? 

అవన్నీ ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి, టీడీపీ సోషల్ మీడియాలో రావడం ఎలా సాధ్యం?

నకిలీ లిక్కర్ ఫ్యాక్టరీ అక్టోబర్ 3న బయట పడితే ఇవాళ్టికి 20 రోజులైంది. చంద్రబాబును సూటిగా అడుగుతున్నా. ఇప్పటికి కూడా వారి కంటెస్టెడ్ క్యాండేట్ జయచంద్రారెడ్డిని ఇంత వరకు ఎందుకు అరెస్టు చేయలేదు?

ఎందుకీ మనిషి పాస్ పోర్టు సీజ్ చేయలేదని అడుగుతున్నా చంద్రబాబును.

ఇదే జయచంద్రారెడ్డి అనే వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడే అయితే, రెండున్నర సంవత్సరాల కిందటి నుంచే యాక్టివిటీ అంతా జరుగుతాఉన్నింటే మరి అటువంటి జయచంద్రారెడ్డికి ఎందుకు మీరు టికెట్ ఇచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారక మీద ఎందుకు పోటీ పెట్టారు? 

ఆశ్చర్యం కలిగించే ఇంకో విషయం చెప్పనా.. జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో డిస్టలరీలు ఉన్నాయని ఎలక్షన్ అఫిడవిట్ లోనే రాశాడు. 

మరి ఆరోజు చంద్రబాబుకు అది కనిపించలేదు. ఆఫ్రికా మూలాలు కనిపించలేదు. ఈరోజు మాత్రం ఈనాడు పేపర్ చూస్తే.. అది టిష్యూ పేపర్ కు ఎక్కువ, బాత్రూమ్ పేపర్ కు తక్కువ. మరి ఆరోజు ఆఫ్రికా లింకులు కనపడలేదా? 

కాస్త ముందుకు పోదాం.. పాలకొల్లులో కల్తీ మద్యం ఎవరిది? అక్కడ వాళ్లకేం ఆఫ్రికా లింకులు లేవు కదా? 

పోనీ ఏలూరులో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? వాళ్లకు కూడా ఆఫ్రికా లింకులు లేవు కదా?

పోనీ అమలాపురంలో పట్టుబడ్డ కల్తీ మద్యం ఎవరిది? వాళ్లకు కూడా ఏమైనా ఉన్నాయా?

పోనీ అనకాపల్లి పరవాడలో పట్టుబడ్డ రుత్తుల రాము స్పీకర్ తో వెరీ క్లోజ్ అసోసియేట్. అక్కడ పట్టుబడ్డ కల్తీ మద్యం ఫ్యాక్టరీ ఎవరిది? రుత్తల రాముకు ఆఫ్రికాతో సంబంధాలున్నాయా? అక్కడి నుంచి స్పిరిట్ వస్తోందా? వీళ్లు కొడుతున్నారా? 

ఏలూరు జిల్లాకు చెందిన ఒక టీడీపీ నాయకుడు డజన్ల కొద్దీ ఆ మనిషి మీద కేసులున్నాయి. ఎంత గొప్ప నాయకుడంటే ఎవర్ని పడితే వాళ్లను తిడతాడు కొడతాడు. మహిళలని కూడా చూడకుండా ఆడ అధికారుల్ని జుట్టుపట్టుకుని ఈడ్చుకుని కూడా పోతాడు. నేను చెప్పాల్సిన పనిలేదు. అంత గొప్ప నాయకుడు మీ అందరికీ తెలుసు. దగ్గరుండి ఆయన లిక్కర్ మాఫియా నడుపుతున్నాడు. 

ప్రభుత్వంలో ఉన్న మరో పేకాట కింగ్.. అది కూడా నేను చెప్పాల్సిన పని లేదు. టీడీపీ నాయకుడు రేపల్లె నుంచి ఎవరు అంటే మీ అందరికీ తెలిసిందే. 

డార్లింగ్ మంత్రి అని కూడా అప్పుడప్పుడు రాధాకృష్ణ ముద్దుగా అంటుంటాడు. ఎవరో నేను చెప్పాల్సిన పని లేదు. మీ అందరికీ బాగా తెలుసు. ఇష్టానుసారంగా ఆయన నడుపుతున్నాడు. ఈ ప్రాంతం అంతా నాది అని చెప్పి.

నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు మనుషులే. నకిలీ మద్యాన్ని తయారు చేసి తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్ లిక్కర్ షాపులకు సప్లయ్ చేసేదీ చంద్రబాబునాయుడు గారి మనుషులే. 

అక్కడే కాదు, తమవారు నడిపే బెల్ట్ షాపులకు కూడా సప్లయ్ చేసేది కూడా చంద్రబాబు నాయుడు మనుషులు, అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలే.

- సీబీఐ విచార‌ణ చేస్తే ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఉన్న మూలాలు వెలుగుచూస్తాయి. కానీ చంద్ర‌బాబు సీబీఐకి ఇవ్వ‌డు. ఆయ‌న‌కు సిట్ అంటేనే ముద్దు. సిట్‌లో ఉన్న సీపీ రాజ‌శేఖ‌ర్ ఈ మాఫియా ముఠాలో పెద్ద భాగ‌స్తుడు. ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్న ఇబ్ర‌హీంప‌ట్నంలోనే న‌కిలీ మద్యం మాఫియా బ‌య‌ట‌ప‌డింది. ఎందుకంటే టాపిక్‌ల‌న్నీ డైవ‌ర్ట్ చేయాలి. త‌ప్పుడు ప్ర‌చారాలు చేయాలంటే ఇలా సిండికేట్‌లో భాగ‌స్వాములైన వారి చేతుల్లోనే అధికారం ఉండాలి. 

టీడీపీ సిండికేట్ చేతుల్లోనే న‌కిలీ లిక్క‌ర్ దందా
ఇంకో గ‌మ్మ‌త్తైన అంశం ఏంటంటే, ఇక‌పై లిక్క‌ర్ అమ్మేట‌ప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమ్మాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఎందుకంటే లిక్క‌ర్ షాపులు, బెల్ట్ షాపులు ఉన్న‌వ‌న్నీ తెలుగుదేశం పార్టీ నాయ‌కులవే క‌దా. ప‌ర్మిట్ రూమ్‌ల‌లో లూజ్ లిక్కర్ విక్ర‌యించేది టీడీపీ నాయ‌కులే క‌దా. న‌కిలీ లిక్క‌ర్ దందా మొత్తం న‌డిచేది టీడీపీ కార్య‌క‌ర్త‌లు, వారి సిండికేట్ మాఫియా క‌నుస‌న్నల్లోనే  కాదా? మ‌రి ఇలాంటి వారికే చంద్ర‌బాబు నాయుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే బాధ్య‌త‌లు ఇస్తున్నాడు. అంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వ‌డం అంటే ఇది కాదా? ప‌్ర‌భుత్వం అమ్మే మ‌ద్యంలో 40 శాతం బెల్ట్ షాపుల ద్వారా, మ‌రో 40 శాతం ఇల్లీగ‌ల్ ప‌ర్మిట్ రూమ్‌ల‌లో అమ్ముతున్నారు. అక్క‌డే కూర్చోబెట్టి గ్లాసుల్లో పోసి తాగిస్తున్నారు. ఎమ్మార్పీ రేటు గాలికెరిగిపోయింది. ఎమ్మార్పీ క‌థ దేవుడెరుగు ఏం పోస్తున్నారో, ఏం తాగుతున్నారో అర్థం కాదు. మూడో రౌండ్ నాలుగో రౌండ్ కి వ‌చ్చేస‌రికి ఐదో రౌండ్‌లో ఏం ప‌డుతుందో తెలియ‌దు. ప్రాణాల‌కు హాని క‌లిగించే లిక్క‌ర్‌ని కూడా న‌కిలీ లేబుల్స్ వేసి అమ్మేస్తున్నారు. రెండో పెగ్గు మూడో పెగ్గుకి తేడా తెలిసినా నాలుగో పెగ్గుకి వ‌చ్చేస‌రికి తేడా క‌న‌ప‌డ‌దని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు తాగే అల‌వాటు లేదు కాబ‌ట్టి అలా అనుకుంటున్నా. అంత బరితెగింపు. మూడో రౌండ్ దాటితే ఎవ‌రు గుర్తుప‌డ‌తారు. పెగ్గుల్లో పోసేయ‌డ‌మే క‌దా అని ఇల్లీగ‌ల్ ప‌ర్మిట్ రూమ్‌ల‌లో పెగ్గుల్లో పోసేస్తున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపుల్లో య‌థేచ్ఛ‌గా అమ్మేస్తున్నాడు. ఎక్క‌డ క్యూఆర్ కోడ్‌, అక్క‌డ ఎవ‌రు స్కాన్ చేస్తారు. 

క్యూఆర్ కోడ్ మా హ‌యాంలోనే తీసుకొచ్చాం
గ‌త మా ప్ర‌భుత్వంలో అయితే  ప్ర‌భుత్వ ఆద్వ‌ర్యంలోనే మ‌ద్యం దుకాణాలు న‌డిచేవి. లాభాపేక్ష ప్ర‌భుత్వానికి లేదు. అందుకే బెల్ట్ షాపులు ర‌ద్దు చేశాం. మ‌ద్యం షాపుల సంఖ్య త‌గ్గించాం. మ‌ద్యం షాపుల వేళ‌లు కూడా త‌గ్గించాం. ఇల్లీగ‌ల్ ప‌ర్మిట్ రూమ్‌లు ర‌ద్దు చేశాం. క్యూఆర్ సిస్టం తీసుకొచ్చింది మేమే. ఇంత‌కు ముందు లేదు. పార‌ద‌ర్శ‌క‌త ఉండాల‌ని మా ప్ర‌భుత్వం వ‌చ్చాక‌నే క్యూఆర్ కోడ్ సిస్టం ప్ర‌వేశ‌పెట్టాం. ప్ర‌తి బాటిల్ మీద క్యూఆర్ కోడ్‌లు డైన‌మిక్‌గా స్కాన్ చేసి అమ్మేవాళ్లం. ఎంప్యాన‌ల్డ్ డిస్టిల‌రీల నుంచి మాత్ర‌మే లిక్క‌ర్ వచ్చేది. కొన్ని వంద‌ల కోట్లు ఖర్చు చేసి ఆ డిస్టిల‌రీలు పెట్టారు. ఆ ఎంప్యానెల్డ్ డిస్టిల‌రీలకు కూడా మేం అనుమ‌తులిచ్చిన‌వి కాదు. గ‌తంలో చంద్ర‌బాబు అనుమ‌తులిచ్చిన‌వే. అవ‌న్నీ ఆయ‌న ఎంప్యాన‌ల్డ్ చేసిన‌వే. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసి డిస్టిల‌రీలు పెడితే వాటిలో నాణ్య‌మైన మ‌ద్యం త‌యారు చేస్తారు. ఆ క్వాలిటీ మ‌ద్యానికి క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేస్ చేసి గ‌వ‌ర్న‌మెంట్ షాపుల‌ల్లో ప్ర‌భుత్వ‌మే అమ్మితే, అమ్మే ప్ర‌తి మందు బాటిల్ క్యూర్ కోడ్ స్కాన్ చేసి విక్ర‌యిస్తే అది తాగే మ‌ద్య‌పాన ప్రియుల ఆరోగ్యానికి కొద్దొగొప్పో గ్యారెంటీ ఉంటుంది. ఆ విధంగా మంచి ఆరోగ్యం ఇచ్చే ప్ర‌య‌త్నం మా ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగింది. కానీ ఈరోజు ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని ప‌ణంగా పెడుతూ విచ్చ‌ల‌విడిగా న‌కిలీ మ‌ద్యం అమ్మేస్తున్నారు. ఒక‌వైపున ఎమ్మార్పీ ధ‌ర‌ల క‌న్నా ఎక్కువ‌కి బెల్ట్ షాపులు, ఇల్లీగ‌ల్ ప‌ర్మిట్ రూమ్‌ల‌లో అమ్మ‌డం క‌ళ్ల‌ముందే క‌నిపిస్తోంది. మ‌రోవైపు న‌కిలీ, క‌ల్తీ మ‌ద్యాన్ని తాగిస్తున్నారు. ప్ర‌తి నాలుగు బాటిల్స్‌లో ఒక‌టి న‌కిలీ మ‌ద్యం బాటిల్ అమ్ముతున్నారు. మ‌రోవైపు ఈ ప్రైవేటు మాఫియా లిక్క‌ర్ షాపుల్లో ఏదైతే ఇండెంట్ ప్లేస్ చేస్తారో.. వీళ్ల‌కు కావాల్సిన డిస్టిల‌రీల‌కు, వీళ్ల‌కు కావాల్సిన బ్రాండ్లు, వీళ్ల‌కు కావాల్సినవి మాత్ర‌మే గ‌వ‌ర్న‌మెంట్‌కి డ‌బ్బులు క‌ట్టి స‌ప్లై చేస్తారు. ఇవ‌న్నీ ఆశ్చ‌ర్యం క‌లిగించే విషయాలు. 

న‌కిలీ మ‌ద్యం డైవ‌ర్ష‌న్ కోసం జోగి ర‌మేశ్‌ని ఇరికించారు
న‌కిలీ మ‌ద్యం డైవ‌ర్ట్ చేసేందుకు మా నాయ‌కుడు జోగి ర‌మేశ్ మీద ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న త‌న రెండు ఫోన్లు ఇలా చూపించాడు. ఆ జ‌నార్ద‌న్‌రావు ఎవ‌రో తెలియ‌దు. సోష‌ల్ మీడియాలో తిరుగుతున్న ఫొటో కూడా పన్నెండేళ్ల క్రితం ఒక పెళ్లిలో క‌లిసిన‌ప్పుడు తీసిన ఫొటో అని జోగి ర‌మేశ్ చెబుతున్నాడు. అస‌లా మ‌నిషితో స‌త్సంబంధాలు లేవ‌ని, ఇవిగో నా ఫోన్ చెక్ చేసుకోమ‌ని త‌న రెండు ఫోన్లు చూపించాడు. 
ప‌రిచ‌య‌మే లేని వ్య‌క్తితో చాటింగ్ చేసిన‌ట్టుగా ఫోన్ పోయింద‌ని చెబుతున్న జ‌నార్ద‌న్‌రావు ఫోన్ నుంచి చాటింగ్ రిలీజ్ అవుతుంది.  ఏ స్థాయిలో వీరు దిగజారిపోయారో చూడండి. ఒక ఫ్యాబ్రికేట్ చేసే కార్య‌క్ర‌మం ఏకంగా వారి ఫోన్ తీసుకోవ‌డ‌మూ, ఆ ఫోన్‌లో చాటింగ్ వీరే జ‌న‌రేట్ చేయ‌డ‌మూ చేశారు. జోగి ర‌మేశ్ సీబీఐ విచార‌ణ చేయాల‌ని డిమాండ్ చేస్తే జ‌నార్ద‌న్‌రావు ఫోన్ పోయింద‌ని ఆయ‌నే కంప్లైట్ ఇచ్చాడు, ఫోన్ లేదు క‌దా అని చెబుతున్నారు. కానీ ఈలోపల డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌లో భాగంగా డ్యామేజ్ చేసేది చేస్తున్నారు క‌దా. ఒక మనిషి టార్గెట్‌గా జ‌రుగుతున్న వ్య‌క్తిత్వ హ‌న‌నం కాదా ఇది అని అడుగుతున్నా. నువ్వు చేసింది ఒక వెధ‌వ ప‌ని. ఆ వెధ‌వ ప‌నిలో టాపిక్ డైవ‌ర్ట్ చేసేందుకు ఇంకో మ‌నిషి మీద అభాండాలు వేయ‌డం. ఇరికించే కార్య‌క్ర‌మం చేయ‌డం. ఇరికించే కార్య‌క్ర‌మంలో ఏకంగా ఆధారాలు త‌యారు చేయ‌డం. అన్యాయం కాదా ఇది. మొన్న అక్ర‌మ లిక్క‌ర్ కేసులో ఒక‌ర్ని ఇరికించేదానికి వీళ్ల డ‌బ్బులు రూ.11 కోట్లు  తీసుకునిపోయి అక్క‌డ పెట్టి స్కాం జ‌రిగిందని ప్ర‌చారం చేశారు. అప్పుడు ఈ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌వారు పోయి ఆ నోట్ల మీద ఉన్న నెంబ‌ర్ల ఆధారంగా ఎవ‌రి బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా చేశారు. ఎప్పుడు డ్రా చేశారు అని తెప్పించ‌మ‌ని కోర్టులో కేసు ఫైల్ చేసి, ఆర్బీఐకి లేఖ రాశారు. ఆ త‌ర్వాత ఇక మాట‌ల్లేవ్‌. ఎక్క‌డైనా ఈ విధంగా రూ.11 కోట్ల డ‌బ్బులు దొరికితే  ప‌క్క‌న పెడ‌తారు క‌దా. కానీ పక్క‌న పెట్ట‌లేదు. మిగ‌తా డ‌బ్బుతో కలిపేశామ‌ని చెప్పారు. అలా ఎలా క‌లిపేస్తారు. అంటే, వీరే డ‌బ్బులు తీసుకొచ్చి ఇంజినీరింగ్ కాలేజీ డొనేష‌న్ల డ‌బ్బు అని ప్లాంట్ చేస్తున్నారు. ఈ టాపిక్ గురించి ఇంకా ఎంత చెప్పుకున్నా త‌క్కువే. ఎందుకంటే ఈ చంద్ర‌బాబుకి న సిగ్గు. న ల‌జ్జ‌. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏద‌న్నా సిగ్గుప‌డ‌తాడ‌ని అనుకోవ‌చ్చు. ల‌జ్జ‌న్నా ఉంటే క‌నీసం అషేమ్‌డ్‌గా ఫీల‌వుతాడ‌నుకోవ‌చ్చు. కానీ అషేమ్‌డ్‌గా ఫీలయ్యేది లేదు. సిగ్గు అంత‌క‌న్నా లేదు. సో అంబారిస్‌మెంట్ లేదు. అషేమ్‌డ్‌గా ఫీలయ్యేది లేదు. ఇలాంటోళ్ల‌తో ఏం మాట్లాడినా లాభ‌మేముంది? 

గూగుల్ డేటా సెంట‌ర్-వాస్త‌వాలు
గూగుల్ డేటా సెంట‌ర్ వారం ప‌ది రోజుల నుంచి బాగా చ‌ర్చ జ‌రుగుతున్న టాపిక్‌. ఆశ్చ‌ర్యం క‌లిగించే విధంగా వార్త‌లు వింటున్నాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌ను ఈరోజున ఎవ‌రైనా చూస్తే.. ఒక‌ప‌క్క ప‌రిపాల‌న గాలికొదిలేసి మ‌రోప‌క్క రాష్ట్రంలో యాడ్ ఏజెన్సీ న‌డిపిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. మాటలు చూస్తేనేమో కోట‌లు దాటుతున్నాయ్‌. పెర్ఫార్మెన్స్ చూస్తే వీక్. వేరే వాళ్ల‌కు ద‌క్కాల్సిన క్రెడిట్‌ని తాను చోరీ చేయ‌డంలో చంద్ర‌బాబు పీక్‌. రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా న‌డుస్తోంది. 

మే 3, 2023న అదానీ డేటా సెంట‌ర్‌కి శంకుస్థాప‌న‌
ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు త‌న సంకుచిత బుద్ధిని చాటుతుంది. నిజంగా వాస్త‌వాల్లోకి పోతే వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వంలో  విశాఖ న‌గరాన్ని ఇంట‌ర్నేష‌నల్ టెక్నాల‌జీ హ‌బ్‌గా తీర్చిదిద్దే కార్య‌క్ర‌మంలో భాగంగా 2020 న‌వంబ‌ర్‌లో అంటే కోవిడ్ స‌మ‌యంలో కూడా అదానీ డేటా సెంట‌ర్‌కి బీజం ప‌డింది. దాని ఫ‌లితంగా 2023 మే 3వ తారీఖున అదానీ డేటా సెంట‌ర్‌కి శంకుస్థాప‌న కూడా వేయ‌డం జ‌రిగింది. అదొక్క‌టే కాదు. స‌బ్సీ కేబుల్ త‌ద్వారా డేటా ల్యాండింగ్ స్టేష‌న్ ఏర్పాటుకు సింగ‌పూర్ నుంచి తీసుకొచ్చే కార్య‌క్ర‌మానికి కూడా అంకురార్ప‌ణ‌ అప్పుడే ప్రారంభమైంది. ఈ స‌బ్సీ కేబుల్ అనేది డేటాని తీసుకురాక‌పోతే ఏ డేటా సెంట‌ర్ రాదు. ద‌ని అంకురార్ప‌ణ జ‌ర‌క్క‌పోతే ఏ డేటా వ‌చ్చే అవ‌కాశ‌మే లేదు.

ఈ సబ్‌ సీ  కేబుల్‌ అనేది డేటాను తీసుకురాకపోతే.. ఏ డేటా సెంటరూ రాదు..దాని అంకురార్పన జరగకపోతే .. అసలు ఏ డేటా వచ్చే అవకాశం లేదు. 
అదానీ డేటా సెంటర్ ఫౌండేషన్‌ స్టోన్‌ వేయకుంటే..రాకపోతే.. మే 3, 2023న అదానీ డేటా సెంటర్ కు ఫౌండేషన్‌ పడింది. ఆయనకు కోవిడ్‌ అయిపోయిన వెంటనే 2020, 
నవంబర్‌ లో అలాట్‌ మెంట్‌ చేశాం. ఇవి రెండు చాలా ముఖ్యమైన విషయాలు..
దీని వెనుక వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం చేసిన కృషి, మరీ ముఖ్యంగా అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్‌ చేసిన కృషి 
అందరి కృషి వల్ల ఈ రోజు దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్‌ రావడం జరిగింది. వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన, ఆ రోజు వేసిన సీడే ఈ రోజు ఈ డేటా సెంటర్‌ కొనసాగింపు. 
అదానీ పెట్టే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్టు.. ఇంతకు ముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టు కు విస్తరణే..గూగుల్‌ పెడుతుందని చెప్పే ఈ 1000 మెగావాట్ల ప్రాజెక్టు.. అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణే

ఇది టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా క్లిప్పింగ్‌. వెరీ ఇంపార్టెంట్‌ క్లిప్పింగ్‌.. టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో 11 అక్టోబర్‌ 2022కు సంబంధించిన పేపరులోని ఐటం. గూగుల్‌
అసోసియేషన్‌ విత్‌ అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌ రిపోర్టెడ్‌ ఇన్‌ అక్టోబర్‌ 2022.గూగుల్‌ టేక్స్‌ ఆన్‌ లీజ్‌. 4.6 ల్యాక్స్‌ స్కెర్‌ ఫీట్‌ స్పేస్‌ ఎట్‌ అదానీ డేటా సెంటర్‌ ఎట్‌ నోయిడానా.
అదానీ, గూగుల్‌ కు మధ్య బిజినెస్ రిలేషన్‌ షిప్‌  అక్టోబర్‌ 2022లో నోయిడాలో ఒప్పందం కుదిరింది.. ఇదివారి మధ్య వ్యాపార సంబంధాన్ని చూపించే పేపర్‌ క్లిప్పింగ్‌ ఇది. 
 
ఈ నేపథ్యంలో విశాఖలో ౩ మే, 2023న ఫౌండేషన్‌ స్టోన్‌ వేశారు. సింగపూర్‌ నుంచి సబ్ సీ కేబుల్‌ తీసుకువచ్చే అంశంపై కూడా అంకురార్పన అప్పుడే జరిగింది. 
అదానీకి ల్యాండ్‌ ఇస్తూ 2020 నవంబర్‌ లో జీవో ఇస్తే...2021లో నాటి వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం సింగపూర్‌ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ లేఖలో చాలా స్పష్టంగా సింగపూర్‌ గవర్నమెంట్‌ ను ఫెసిలిటేట్‌ చేయమని చెప్పి… సింగపూర్‌ నుంచి విశాఖ పట్నానికి సబ్‌ సీ కేబుల్‌ తీసుకువచ్చే ప్రక్రియలో వారిని కూడా భాగస్వామ్యులను కమ్మని చెప్పి..సింగపూర్‌ ప్రభుత్వానికి.. ఏపీ ప్రభుత్వం 9-3-2020న లేఖ రాసింది. ఈ లేఖలో ప్రతి పేరాలో చాలా ముఖ్యమైన విషయాలు అర్థమవుతాయి. మీడియాకు అందుబాటులో పెడతాం. (లాస్ట్‌ పేరా చవివి వినిపించిన జగన్‌ )సింగపూర్‌ నుంచి విశాఖకు దాదాపు 3900 కి.మీ. సముద్రంలోంచి ఈ సబ్ సీ కేబుల్‌ వేయాలి. వేసి ఆ కేరిడార్‌ ను క్రియేట్‌ చేస్తే
 ఆ డేటాను విశాఖ పట్నానికి తీసుకురాగలుగుతాము. అదానీ డేటా సెంటర్‌ కడితే..అప్పుడు ఆ డేటా అక్కడికి వస్తుంది. అదానీకి, గూగుల్‌ కు మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలను నోయిడాలో 2022లో దీనికి సంబంధించి స్పేస్‌ విషయమైన ఒప్పందం... ఆ రెండు సంస్థల మధ్య వ్యాపార భాగస్వామ్యం విషయం టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో ప్రచురించిన క్లిప్పింగ్‌ ను మనం చూశాం. 

వీరి భాగస్వామ్యం కొనసాగింపులో భాగంగా మనం విశాఖపట్నంలో డేటా సెంటర్‌ పెట్టాలి అని అనుకోవడం..వీళ్లకి 2020 నవంబర్‌ లో స్థలం ఇవ్వడం..9-3-2021లో సింగపూర్‌ ప్రభుత్వానికి సబ్‌ సీ కేబుల్‌ తీసుకువచ్చేందుకు ఫెసిలిటేట్‌  చేయమని సింగపూర్‌ ప్రభుత్వానికి లేఖ రాయడం, ఆ తర్వాత 2023న ఈ అదానీ డేటా సెంటర్‌ కు ఫౌండేషన్‌ స్టోన్‌ వేయడం జరిగాయి. ఇదీ బ్యాక్‌ గ్రౌండ్‌. 300 మెగావాట్ల డేటా సెంటర్‌ కు నాటి అదానీ, వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం, సింగపూర్‌ ప్రభుత్వం, గూగుల్‌ ఏ విధంగా అడుగులు వేశారో చెప్పడానికి సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవి.
ఈరోజు చూస్తే.. విశాఖలో గూగుల్‌ కు మొన్న జరిగింది చూస్తూ..చంద్రబాబు చెప్పకూడదని ఎంత తాపత్రయపడ్డాడో.. వేరేవారికి క్రెడిట్‌ ఇవ్వాల్సి వస్తుంది..తనకు క్రెడిట్‌ రాదని చెప్పి..చంద్రబాబు దాచిపెట్టాలని ప్రయత్నం చేశాడో దానికి సంబంధించిన విషయం.. ఇక్కడ కూడా వైజాగ్‌ లో అదానీ ఇన్‌ ఫ్రాకు సంబంధించిన కంపెనీలే..ఈ సెంటర్‌ ను నిర్మిస్తున్నాయి. గూగుల్‌ కు సంబంధించిన  అలెగ్జాండర్‌ స్మిత్‌ అప్పట్లో మన ఐటీ సెక్రటరీ భాస్కర్‌ కు ఇది 4అక్టోబర్‌ 2025  ఢిల్లీకి పోయి హడావుడి చేసి..సంతకాలు పెట్టకముందు. టెన్స్‌ డేస్‌ ముందు..లేఖ రాశారు. డియర్‌ మిస్టర్‌ భాస్కర్‌..థ్యాంక్యు ఫర్‌ దిస్‌ డిటెయిల్డ్‌ డిస్కషన్‌ దిస్‌ వీక్‌. ఐ పర్టిక్యులర్లీ అప్రిషియేట్‌ ఆల్‌ యువర్‌ ఎఫర్ట్స్‌ వైల్‌ యూ హావ్‌ బీన్‌ ట్రావలింగ్‌ ఇంటర్నేషనన్లీ..ఇన్‌ ఆర్డర్‌ టూ ఎన్ ష్యూర్‌ క్లియర్‌ కో ఆర్డినేషన్‌ ఆన్‌ ఆల్‌ మేటర్స్‌. రిలేటెడ్‌ టూ ల్యాండ్ ప్రిపరేషన్‌ అండ్‌ ఆలాట్‌ మెంట్‌.
  వీ వుడ్‌ లైక్‌ టూ ఆథరైజ్‌ మిస్టర్‌ సంజయ్‌ బుటానీ..ఆఫ్‌ అదానీ టూ సర్వ్‌  ఏజ్‌ ఏన్‌ ఆథరైజ్డ్‌ పాయింట్‌ ఆఫ్‌ కాంటాక్ట్‌. ఏపీ గవర్నమెంట్‌ ఇన్‌ ప్రిపేరేషన్‌ ఫర్‌ ది ల్యాండ్‌ అలాట్‌ మెంట్‌ యాజ్‌ షేర్డ్‌ విత్‌ యూ ప్రీవియస్‌ లీ. టూ ఫెసిలిటేట్‌ ద ల్యాండ్ అలాట్‌ మెంట్‌ ప్రాసెస్‌. ప్లీజ్‌ సీ ద అటాచ్డ్‌ డిటెయిల్స్‌ ఆఫ్‌ ద రిలవెంట్‌ అదానీ ఎంటిటీస్‌..దట్‌ వీ ఆర్‌ ఆథరైజింగ్‌..టూ బీ  యూజ్డ్‌ ఫర్‌ ది ఫార్మల్‌ అలాట్‌ మెంట్‌ ప్రాసెస్‌ ఈచ్‌ ఆఫ్‌ ద త్రీ సైట్‌ లొకేషన్స్‌. దాని అర్థం అదానీ ఇన్‌ ఫ్రా కి సంబంధించిన మూడు కంపెనీలకు ల్యాండ్‌ అలాట్‌ మెంట్‌ చేయమంటూ గూగుల్‌ అప్పటి ఐటీ సెక్రటరీ భాస్కర్‌ కు లేఖ రాసింది. ఇన్‌ డీపీఆర్‌ డిస్కషన్స్‌..ఆల్‌ ఇన్సెంటివ్స్‌ ఇన్‌ ది జీవో వీల్ బీ గివెన్‌ టూ ది అప్లికెంట్‌..రాడెన్‌  ఇన్‌ ఫో టెక్‌ ప్రై.లిమిటెడ్‌. వన్స్‌ జీవో ఈజ్‌ ఇష్యూడ్‌. వీ విల్‌  దేర్‌ ఆఫ్టర్‌ మిస్టర్‌ భాస్కర్‌. ఎట్‌ ద కెపాసిటీ ఆఫ్‌ ఐటీ సెక్రటరీ..టోటట్‌ గా ఈ ప్రాజెక్టుకు సంబంధించి 
గూగుల్‌ ను తీసుకువచ్చేదానికి అదానీ 87వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. దిస్‌ ప్రాజెక్టు ఈజ్‌ డెవలప్డ్‌‌ బై అదానీ. 10 బిలియన్‌ డాలర్స్‌ ఖర్చు చేసి గూగుల్‌ ను తీసుకువచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఎంటైర్‌ ప్రాజెక్ట్‌ విల్‌ బీ కన్స్ట్రక్టెడ్‌  బై అదానీ. వరల్డ్‌ లార్జెస్ట్‌ డేటా సెంటర్‌. కట్టిన తర్వాత గూగుల్‌ క్లయింట్‌ గా వాడుకుంటుంది. ఇంతకు ముందు చెప్పినట్లు.. కేబుల్‌ రావాలి..డేటా సెంటర్‌ కట్టాలి.. అప్పుడు గూగుల్‌ వస్తుంది. ఈ డేటా సెంటర్‌ కు సంబంధించిన హార్డ్‌ వేర్‌, టెక్నాలజీని గూగుల్‌  సమకూరుస్తుంది.

నిజంగా ఇలాంటి డేటా సెంటర్ ను మన దేశానికి చెందిన అదానీ లాంటి గొప్ప కంపెనీ కడుతోందని గొప్పగా, గర్వంగా చెప్పుకోవాల్సింది పోయి.. 10 బిలియన్ డాలర్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇంత కష్టపడి, కేంద్ర ప్రభుత్వం, సింగపూర్ గవర్నమెంట్, వైయస్సార్ సీపీ గత ప్రభుత్వం, 87 వేల కోట్ల పెట్టుబడి.. ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తోంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలి?

కనీసం అదానీ 87 వేల కోట్లు పెడుతున్నాడు,  గూగుల్ ను తెస్తున్నాడు.. థ్యాంక్యూ అని చెప్పాడా చంద్రబాబు కనీసం. క్రెడిట్ ఇచ్చాడా కనీసం. 

ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెడితే బ్యాగ్రౌండ్ లోకి పోతుంది. 

వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది, అప్పుడే గూగుల్ కు అదానీకి రిలేషన్ ఉన్నింది, అప్పుడే జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్ కు లేఖ రాసింది, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదానీ ఇన్వాల్వ్ అయ్యి, వైయస్సార్ సీపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి.. ఇంత మంది ఇన్వాల్వ్ అయ్యి ఈ గూగుల్ ను ఇక్కడికి తీసుకొచ్చేదానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేశాడు. 

ఎందుకంటే క్రెడిట్ ఇవ్వడానికి ఇష్టం లేదు. 

ఇక్కడ మరో కీలకమైన విషయం చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డేటా సెంటర్ లో అతి ముఖ్యమైన అంశం.. సముద్ర గర్భంలో వేస్తున్న కేబుల్. సబ్ సీ కేబుల్. 

సింగపూర్, విశాఖపట్నం 3900 కిలోమీటర్లు. ఈ మేర వైజాగ్ కు కేబుల్ వేయాలి. అదానీ డేటా సెంటర్ ఏర్పాటులో భాగంగా ఈ కేబుల్ తీసుకుని రావాలి, కేంద్ర ప్రభుత్వం, అప్పట్లో వైయస్సార్ సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం.. వీరందరూ ఇన్వాల్వ్ అయ్యింటేనే ఇది జరుగుతోంది. చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఇది.

ఈరోజు అంతా అయిపోయిన తర్వాత ఈయనొచ్చి ఈయన సుందర ముఖారవిందాన్ని చూసి గూగుల్ వచ్చేసినట్లుగా బిల్డప్ ఇచ్చేయడం, అసలు మిగిలిన వాళ్లందరూ చేసిన కృషిని పూర్తిగా సైడ్ లైన్ చేసేయడం, 80 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నాడు పాపం ఆయన. ఆయన్ను కూడా కనీసం వాళ్ల అకేషన్లో ఆయన కూడా లేడు. మళ్లీ ఆయన ట్వీట్ చేశాడు. ఏ స్టేజ్ కు దిగజారిపోయాడు. (అదానీ ట్వీట్ చూపించారు. చదివి వినిపించారు)

గతంలో 300 మెగావాట్ల డేటా సెంటర్ కోసం 190 ఎకరాలు విశాఖపట్నంలోని మధురవాడలో 130 ఎకరాలు, కాపులుప్పాడలో 60 ఎకరాలు అదానీకి వైయస్సార్ సీపీ కేటాయించడం, అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. అక్కడ పనులకు శంకుస్థాపన చేయడం, సబ్ సీ కేబుల్ ను సింగపూర్ నుంచి విశాఖపట్నానికి తీసుకురావడానికి అంకురార్పణ చేయడం అప్పుడే జరిగాయి. 

ఇప్పుడు ఇవాళ కొత్తగా వస్తున్న 1000 మెగావాట్ల గూగుల్ ప్రాజెక్టుకు 300 మెగావాట్లు మేం ఇచ్చేటప్పుడే డేటా సెంటర్లో ఉద్యోగ అవకాశాలు తక్కువే. 

కానీ డేటా సెంటర్ రావడం వల్ల ఒక ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రేప్పొద్దున ప్రపంచాన్ని డామినేట్ చేయబోయే నెక్స్ట్ టెక్నాలజీ. 

ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా లేదా క్వాంటం కంప్యూటింగ్ కు అయినా కూడా రేప్పొద్దున ఫ్యూచర్లో జరిగే ఎటువంటి గొప్ప మార్పుకైనా గానీ డేటా సెంటర్ అనేది విల్ బీ ద నోడల్ పాయింట్. 

ఇక్కడ డేటా ఉంటే ఆ డేటాను రకరకాలుగా, మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది. కాబట్టి డేటా సెంటర్ అనేది కీలకం. 

ఎప్పుడైతే డేటా సెంటర్ వస్తుందో అప్పుడు ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. ఆ ఎకో సిస్టమ్ ద్వారా గ్లోబల్ కేపబుల్ సెంటర్స్ వస్తాయి. 

దానికి నాంది ఆరోజు ఆ ఆలోచనలతో అక్కడి నుంచి మొదలైంది. 

ఆరోజుల్లో ఉట్టి 300 మెగావాట్ల డేటా సెంటర్ పెడితే ఉద్యోగాలు తక్కువ వస్తాయి కాబట్టి అంతటితో మేం ఆగలేదు. 

ఆరోజు అదానీకి మేం చేసుకున్న అండర్ స్టాండింగ్ కాపీ మీరు చూస్తే 25 వేల జాబులు కూడా ఇవ్వాలన్నాం. 
(కాపీ చూపించారు.)

ఐటీ పార్క్ పెట్టాలి, స్కిల్ కాలేజీ, రిక్రియేషన్ సెంటర్, స్కిల్ సెంటర్ ఇవన్నీ కూడా పెట్టాలని, వీటి ద్వారా 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలని పార్ట్ ఆఫ్ ది అగ్రిమెంట్ చేశాం మేము అప్పట్లో. 

చంద్రబాబునాయుడు అనే వ్యక్తి ఈ మాదిరిగా చేయడం కొత్త కాదు ఇది. చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంటుందంటే ఎఫిషియన్సీ వీక్, వేరేవాళ్లకు సంబంధించిన క్రెడిట్ చోరీ చేయడంలో మాత్రం పీక్.

హైదరాబాద్ విషయంలో కూడా చంద్రబాబుది గతంలో ఇదే సేమ్ స్టోరీ. 

మాదాపూర్ లో సైబర్ టవర్స్ అన్నది 6 ఎకరాల స్థలంలో ఒక చిన్న ప్రాజెక్టు. దానిపేరు హైటెక్ సిటీ. ఈ హైటెక్ సిటీకి కూడా పునాది రాయి వేసింది ఎవరు? ఎన్.జనార్దన్ రెడ్డి గారు. అది కూడా. కానీ చంద్రబాబు గారు దాన్ని ఎప్పుడూ చెప్పడు. ఆ ఒక్క 6 ఎకరాల్లో 1,40,800 ఎస్ఎఫ్టీ బిల్డింగ్. ఒకే ఒక్క బిల్డింగ్. తర్వాత ఎన్.జనార్దన్ రెడ్డి వెళ్లిపోవడం, ఈయన ముఖ్యమంత్రిగా రావడం, దాన్ని గవర్నమెంట్ రంగంలో చేయడానికి ఎన్.జనార్దన్ రెడ్డి శ్రీకారం చుడితే దాన్ని క్యాన్సిల్ చేసి ఈయన ప్రైవేట్ కు ఇచ్చి అక్కడ 1.40 లక్షల ఎస్ఎఫ్టీ కట్టారు. దాన్ని ఏకంగా హైదరాబాద్ అంతా నేనే కట్టానని ప్రొజెక్షన్.

విషయం ఏమిటంటే 2004లో చంద్రబాబు ఓడిపోయాడు. హైదరాబాద్ అన్నది చంద్రబాబు చేతుల్లో లేదు. 2004, 2009లలో నాన్నగారు గెలిచారు. తర్వాత మరో రెండుసార్లు కేసీఆర్ గారు గెలిచారు. అంటే దాని అర్థం ఏకంగా 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్ కు ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా ఆయనదేఅంటాడు. చంద్రబాబు నాయుడు బిల్డప్. 

అయ్యా చంద్రబాబు గారూ.. 6 ఎకరాల్లో చిన్న బిల్డింగ్ కడితే, దాని పేరు హైటెక్ సిటీ అని పెడితే దానితో డెవలప్మెంట్ అనేది అయిపోతుందని అనుకోవడం మూర్ఖత్వం. దాని తర్వాత నువ్వు వెళ్లిపోయావు. దాని తర్వాత రాజశేఖరరెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయ్యారు. ఓఆర్ఆర్ ఫేస్ 1.. 126 కి.మీ. 2006లో మొదలుపెట్టి 2012లో పూర్తి చేశారు. అది హైదరాబాద్ సిటీనే మార్చేసింది. పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే. 11.6 కి.మీ. ఫ్లై ఓవర్. ఇండియాలోనే లార్జెస్ట్ ఫ్లై ఓవర్ అక్టోబర్ 2005లో మొదలుపెట్టి నవంబర్ 19, 2009కు పూర్తి చేశారు. జీఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు మార్చి 2005లో మొదలు పెట్టి  23, మార్చి 2008కి పూర్తి చేశారు. 

ఇవన్నీ రాజశేఖరరెడ్డి గారి హయాంలో స్టార్ట్ చేయడం, పూర్తి చేయడం.. 2004 నుంచి 2014 వరకు వైయస్సార్ గారి రెండు టర్ముల్లో అందులో మొదటి టర్ములోనే ఇవన్నీ పూర్తి అయ్యాయి. ఓఆర్ఆర్ ఒక్కటే 2012 దాకా పోయింది. 

ఇవన్నీ జరిగాయి కాబట్టే చంద్రబాబు దిగిపోయేనాటికి 2003-04లో రాష్ట్రం నుంచి అప్పట్లో తెలంగాణ, ఆంధ్ర కలిసున్న రాష్ట్రం నుంచి ఐటీ, ఐటీ రిలేటెడ్ ఎక్స్ పోర్ట్స్ చూస్తే 5,660 కోట్లు. 

5 సంవత్సరాల్లో వైయస్సార్ గారు ముఖ్యమంత్రి కావడం, 2004 నుంచి 2009 ఐదే 5 సంవత్సరాల్లో ఇవన్నీ వైయస్సార్ గారు చేయగలిగారు కాబట్టే ఐటీ, ఐటీఈఎస్ ఎక్స్ పోర్ట్స్ ఎంతో తెలుసా? 2008-09 వచ్చే సరికే 32,509 కోట్లు. 

ఎక్కడ 5,600 కోట్లు ఎక్కడ 32,509 కోట్లు? ఐదేళ్లే. 

ఆ తర్వాత సెకండ్ టర్మ్ వచ్చే సరికే.. ఆయన చనిపోయినా కానీ ఆయన గెలిపించి ఇచ్చిన ప్రభుత్వం.. ఆ టైమ్ అయిపోయే సరికే 2013-14 వచ్చే సరికే 57 వేల కోట్ల ఎక్స్ పోర్ట్స్. 

హైదరాబాద్ అంతా నేనే కట్టేశాను, ఐటీ అంటే చంద్రబాబు నేనే అని చెప్పుకునే పరిస్థితి నుంచి సీ ద డిఫరెన్స్. 

వేరేవాళ్లు చేసిన దానికి వాళ్లకు క్రెడిట్ ఇవ్వాలి. దాని తర్వాత నాన్న తర్వాత కేసీఆర్ వచ్చారు. ఆయన రెండు టర్మ్స్ ఉన్నారు. ఆయన కూడా గొప్పగా నాన్న గారి దగ్గర నుంచి ఎక్కడైతే ఎండ్ అయ్యిందో ఆయన కూడా గొప్పగా స్టార్ట్ చేశాడు. 

ఆయన కూడా గొప్ప పరిపాలన చేశాడు. దాని వల్ల హైదరాబాద్ ఈరోజు ఐటీలో మేటిగా ఉంది. 

ఈరోజు ఐటీ ఎక్స్ పోర్ట్స్ తెలంగాణ నుంచి 2 లక్షల కోట్లు. 

ఎక్కడ 5,660 కోట్లు నువ్వు వదిలేసింది? ఎక్కడ ఇవాళ 2 లక్షల కోట్లు. మధ్యలో 20 ఏళ్లలో ఇంత జరిగితే.. అది కేవలం నేను నాన్న చేసినదే చెప్పాను. కేసీఆర్ గారు చేసింది చెప్పలేదు. అది చెప్పకనే మొత్తం నేనే చేసినా, హైదరాబాద్ మొత్తం నాదే అంటే ఎట్లుంటుంది? చంద్రబాబు నాయుడుకు ఇది కొత్త కాదు. ఇది సహజంగా చంద్రబాబుకు ఉండే పబ్లిసిటీ స్టంట్. క్రెడిట్ వేరేవాళ్లకు ఎవరికైనా కూడా ఇవ్వడు. వేరేవాళ్లకు ఇవ్వాల్సిన డ్యూ క్రెడిట్ ఇవ్వకపోవడం చంద్రబాబుకు ఉన్న దుర్మార్గమైన నైజం. 

విశాఖపట్నం గురించి ఇంత ఆలోచన చేసి, విశాఖపట్నం అన్నది ఎంతో ఇంపార్టెంట్ ప్రదేశంగా, ఆంధ్రరాష్ట్రం పెరగాలంటే, హైదరాబాదునో, బెంగళూరునో, చెన్నైనో తలదన్నే పరిస్థితి రావాలంటే విశాఖపట్నంలో, ఉత్తరాంధ్రలో ఏమేమి చేస్తే ఆ స్థాయిలోకి మనం పోగలగుతాం అని ఆలోచన చేసి అడుగులు వేశాం మేము.వైయస్సార్ సీపీ ప్రభుత్వం. 

అందులో భాగంగా మేం వేసిన అడుగులు.. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు. 2,700 ఎకరాల్లో చంద్రబాబు హయాంలో ఎంత అక్విజేషన్ చేశారో తెలుసా? కేవలం 377 ఎకరాలు. అంతే. 

వైయస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 900 కోట్లు ఖర్చుపెట్టాం ల్యాండ్ అక్విజేషన్ కు, ఆర్ అండ్ ఆర్ కు. ల్యాండ్ కంప్లీట్ చేసి, ఎయిర్ పోర్టు నిర్మాణం మొదలు పెట్టి 30 శాతం పూర్తి చేశాం. 

ఇంకో సంవత్సరంలో ప్రాజెక్టు కూడా అయిపోతుంది. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో మూలపేట కొత్త పోర్టు. ఉత్తరాంధ్ర దశ, దిశ మార్చాలంటే శ్రీకాకుళంలో ఒక పోర్టు రావాలి, వస్తేనే ఉత్తరాంధ్ర దశ, దిశ మారుతుందని మూలపేటలో గవర్నమెంట్ పోర్టు.. ల్యాండ్ అక్విజేషన్ పూర్తి చేసి, క్లియర్స్ అన్నీ తీసుకొచ్చి, నిర్మాణం మొదలు పెట్టి 30 శాతం పూర్తి చేశాం. 

విజయనగరంలో మెడికల్ కాలేజ్. 3 బ్యాచులు క్లాసులు కూడా జరిగాయి. కోర్సులు కూడా కంప్లీట్ అయ్యాయి. 

పాడేరు మెడికల్ కాలేజీ, క్లాసులు స్టార్ట్ అయ్యాయి. పార్వతీపురం మెడికల్ కాలేజీ, పనులు జరుగుతున్నాయి. నర్సీపట్నం మెడికల్ కాలేజీ పనులు జరుగుతున్నాయి. ఉద్దానంలో కిడ్నీ రీసెర్స్ సెంటర్. రూ100 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ బిల్డింగ్. రూ.600 కోట్లు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేజ్ వాటర్ తీసుకొచ్చి డయాలసిస్ పేషెంట్లకు పర్మినెంట్ సొల్యూషన్ చూపించే కార్యక్రమానికి పనులు మొదలు పెట్టడమే కాదు పూర్తి చేశాం. 

సీతంపేటలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, పార్వతీపురంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపు పూర్తి. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయి. సాలూరులో ట్రైబల్ యూనివర్సిటీ పనులు జరుగుతున్నాయి. నక్కపల్లిలో ఇండస్ట్రియల్ హబ్, అన్నవరంలో ఒబెరాయ్ హోటల్ రిసార్ట్. 

ఒక 5 స్టార్ హోటల్ రిసార్టులు విశాఖపట్నంలో ఉండటం చాలా అవసరం అనిచెప్పి మే ఫేర్కు ఒబెరాయ్ ని తీసుకొచ్చి అక్కడ 5 స్టార్ హోటల్ రిసార్టును కట్టిస్తున్నాం. డెస్టినేషన్ గా విశాఖపట్నం ఉండాలి అంటే 5 స్టార్ రిసార్టులు ఉండాలి అని చెప్పి. 

రుషికొండ వద్ద హై ఎండ్ టూరిజం రిసార్ట్. ఇట్స్ ఎ మాన్యుమెంట్ బిల్డింగ్ దేర్. ఇక్కడ స్క్వయర్ ఫీట్ కు రూ.10 వేలు పెట్టి కట్టిందే కడుతున్నారు. ఎన్నిసార్లు కట్టినా కట్టిందే కడుతున్నారు. డబ్బులు వేస్ట్ అవుతున్నాయి. ఎన్నిసార్లు కడతారో అర్థం కాదు. అదే సెక్రటేరియట్ రెండు సార్లు కడతారు, అదే అసెంబ్లీ రెండు సార్లు కడతారు, రూ.600 కోట్ల పైగా డబ్బు వేస్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికీ కనపడుతోంది కానీ డబ్బులు వేస్ట్ అని ఎవడూ మాట్లాడడు. ఎందుకంటే ఎల్లో మీడియా మొత్తం వాళ్లే. అంతా దోచుకోవడం, పంచుకోవడం తినుకోవడం. 

స్క్వయర్ ఫీట్ బెంగళూరులో గానీ, హైదరాబాద్ లో గానీ, చెన్నైలో గానీ కడితే 5 స్టార్ ఫెసిలిటీస్ ఉన్న ఫ్లాట్లు 4500 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ కడితే బ్రహ్మాండంగా నిర్మాణ ఖర్చు దాటదు. 

రూ.10 వేలు పర్ ఎస్ఎఫ్టీ కడుతున్నారు అమరావతిలో. ఎవడూ స్కామ్ అని చెప్పి అనడు. ఎందుకంటే స్కాములో వీళ్లంతా భాగస్వాములే.

మా హ‌యాంలో అదానీ డేటా సెంట‌ర్ త‌ద్వారా వ‌చ్చిన గూగుల్‌, ఇన్ఫోసిస్‌, ఇనార్బిట్ మాల్‌, కైలాస‌గిరి సైన్స్ మ్యూజియం, రిషికొండ వ‌ద్ద టీటీడీ దేవాల‌యం, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజ‌న్ హ‌బ్‌.. ఇవ‌న్నీ కొన్ని ప్రాజెక్టులు నేను చెబుతున్నా. ఇవ‌న్నీ జ‌రిగి.. విశాఖ‌ప‌ట్నం నుంచి రోడ్డు- టు ది ఎయిర్‌పోర్ట్ అండ్ టు ది మూల‌పేట పోర్టు. సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్‌ను క‌న్వీన్స్ చేసి గ‌ట్క‌రీ గారితో స్టేట్‌మెంట్ ఇప్పించాం. 

ఇవ‌న్నీ జ‌రిగితే అదొక కారిడార్‌. ఇది విజ‌న్‌. ఇవ‌న్నీ పూర్త‌యితే పురోగ‌తి అనేది క‌నిపిస్తుంది. నంబ‌ర్స్ క‌నిపిస్తాయి. లేక‌పోతే రూ.5650 కోట్లే పెద్ద నంబ‌ర్ అని డ‌బ్బాలు కొట్టుకోవ‌డ‌మే. రాష్ట్రం పెర‌గాలంటే ఏం చేయాల‌నే విజ‌న్ అనేది లేకుండా.. వీళ్లు ఏర‌కంగా ఉన్నార‌నేది ఇవ‌న్నీ ఉదాహ‌ర‌ణ‌. 

మా హ‌యాంలో గొప్ప‌గా చెబుతున్నా.. దేవుడి ద‌య‌తో, ప్ర‌జ‌ల ఆశీర్వాదాల‌తో ఐదేళ్ల కాలంలో రెండేళ్లు కోవిడ్ ఉన్నా కూడా.. కేవ‌లం మా చేతుల్లో మూడు సంవ‌త్స‌రాల టైమ్ మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ.. గొప్ప గొప్ప సంస్క‌ర‌ణ‌లు తేగ‌లిగాం. 

స్కూళ్లు మార్చాం.. నాడు-నేడు అయితేనేమీ, డిజిటల్ క్లాస్ రూమ్స్‌, టోఫిల్ క్లాస్‌లు, 8వ త‌ర‌గ‌తి పిల్ల‌ల చేతుల్లో ట్యాబ్‌లు, సీబీఎస్ఈ కాదు ఐబీ సిల‌బ‌స్ తీసుకువ‌చ్చే కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాం. విద్యా, వైద్యం, వ్య‌వ‌సాయంలో అనూహ్య మార్పులు తీసుకువ‌చ్చాం. 

గ్రామాల్లో సేవ‌లు గ‌డ‌ప వ‌ద్ద‌కు తీసుకువ‌చ్చాం. గ‌వ‌ర్న‌మెంట్ సేవ‌ల్లో పార‌ద‌ర్శ‌క‌త ఉండ‌ద‌నే భావ‌న లేకుండా చేశాం. ప్ర‌భుత్వ సేవ‌లు లంచాలు లేకుండా పొంద‌గ‌ల‌మ‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో స్వ‌చ్ఛందంగా నిరూపించ‌గ‌లిగాం. గొప్ప‌గా అందించ‌గ‌లిగాం. గొప్ప గొప్ప సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చాం. చాలా సంతోషంగా, గ‌ర్వంగా ఉన్నాం. మూడేళ్ల‌లో ఎవ‌రూ చేయ‌లేని గొప్ప కార్య‌క్ర‌మాలు దేవుడి ద‌య‌తో చేయ‌గ‌లిగాం. అందుకే ఈరోజుకీ చిరున‌వ్వుతో మా పార్టీ క్యాడ‌ర్ ఏ గ‌డ‌ప వ‌ద్ద‌కు అయినా వెళ్ల‌గ‌లుగుతున్నారు. 

మేం చేసిన వుమెన్ ఎంప‌ర్‌మెంట్‌, రిఫామ్స్ అయితేనేమీ ఇవ‌న్నీ మాకు శ్రీ‌రామ‌ర‌క్ష‌గా, ఈరోజు ప్ర‌జ‌లు గొప్ప‌గా మ‌మ్మ‌ల్ని రిసీవ్ చేసుకునే ప‌రిస్థితిలో గొప్ప‌గా ప‌రిపాల‌న చేయ‌గ‌లిగామ‌ని చెప్ప‌గ‌లుగుతున్నాం. 

ఉద్యోగుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు - ఉద్యోగుల విష‌యాల‌పై చంద్ర‌బాబు నాయుడు పిల్లిమొగ్గ‌లు

చంద్ర‌బాబు ప్ర‌చారం నిజంగా ఎలా ఉంటుందంటే.. ఉద్యోగుల‌కు ఇచ్చిన డీఏ చిన్న ఉదాహ‌ర‌ణ‌. ఆయ‌న సీఎం కుర్చీలోకి వ‌చ్చి 18 నెల‌లు అవుతోంది. పెండింగ్‌లో 4 డీఏలు ఉన్నాయి. జ‌న‌వ‌రి 2004, జూలై 2024, డిసెంబ‌ర్ 2024, జూలై 2025 ఇలా 4 డీఏలు పెండింగ్‌. ఒక్క డీఏ కూడా ఇంత‌వ‌ర‌కు ఇవ్వ‌లేదు. ఉద్యోగులంతా రోడ్డెక్కిన త‌రువాత అనేక డ్రామాలు చేస్తూ ఒక్క డీఏ ప్ర‌క‌టించాడు. ఆ ప్ర‌క‌ట‌నే త‌ప్ప‌.. ఇంత వ‌ర‌కు ఇచ్చింది లేదు. 

ఫ‌స్ట్ ద‌స‌రా అన్నాడు, త‌రువాత న‌వంబ‌ర్ అన్నాడు.. త‌రువాత దీపావ‌ళి అన్నాడు.. దానికి పెద్ద బిల్డ‌ప్ ఇచ్చారు. వాళ్ల‌కు రావాల్సింది నాలుగు ఉంటే ఒక్క డీఏకి ఉద్యోగులంతా సంబ‌రాలు అంటూ ప్ర‌చారం న‌డిపారు. గిమ్మిక్కులు చేశారు. చివ‌ర‌కు ఇచ్చిన ఒక్క డీఏ జీవో వ‌చ్చిన త‌రువాత చూస్తే ఈ డీఏ అరియ‌ర్స్ కూడా రిటైర్డ్ అయిన త‌రువాత ఇస్తామ‌ని చెప్పారు. 3.5 ల‌క్ష‌ల మంది పెన్ష‌న‌ర్ల‌కు డీఆర్ రెండేళ్ల త‌రువాత 2027-28లో ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. 

దీనికి దీపావ‌ళి కానుక‌, సంబ‌రాలు అంటూ ఏకంగా ప్ర‌చారాలు చేశారు. చ‌రిత్ర‌లో ఎవ‌రూ ఎప్పుడూ చేయ‌లేదు ఇలా. డీఏ అరియ‌ర్స్ రిటైర్డ్ అయిపోయిన త‌రువాత ఇచ్చే కార్య‌క్ర‌మం చ‌రిత్ర‌లో జ‌ర‌గ‌లేదు. కానీ, చంద్ర‌బాబు జీవో ఇచ్చాడు. 

కోవిడ్ లాంటి క‌ష్ట‌కాలంలో ఉన్నా కూడా ఉద్యోగుల విష‌యంలో వెన‌క‌డుగు వేయ‌లేదు. మామూలుగా ఐదేళ్ల కాలంలో 10 డీఏలు ఇవ్వాలి కానీ, వైఎస్సార్ సీపీ హ‌యాంలో 11 డీఏలు ఇచ్చాం. కోవిడ్ లాంటి క‌ష్ట‌కాలంలో ఉన్నా కూడా ఉద్యోగుల ప‌క్షాన నిలిచి 11 డీఏలు ఇచ్చాం.

చంద్ర‌బాబు నాయుడు అంత‌కుముందు ప్ర‌భుత్వంలో కేవ‌లం 8 మంది డీఏలు మాత్ర‌మే ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చాక నాలుగు పెండింగ్ ఉంటే ఒక‌టి ఇస్తాన‌న్నాడు.. ఆ ఒక‌టి కూడా డీఏ అరియ‌ర్స్ రిటైర్డ్ అయ్యాక అన్నాడు. పెన్ష‌న‌ర్ల‌కు డీఆర్ రెండేళ్ల త‌రువాత 2027-28లో ఇస్తాన‌ని ప్ర‌క‌టించాడు. చంద్ర‌బాబు ఇచ్చిన జీవోపై ప్ర‌తి ఉద్యోగి తిట్ట‌డం మొద‌లుపెట్టారు. 

దీనికి పండ‌గ చేసుకోవ‌డం ఏంటీ..? గ‌తంలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు ఇలా.. గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌నిది చంద్ర‌బాబు చేస్తున్నాడు.. ఇంత అన్యాయ‌మైన ముఖ్య‌మంత్రి ప్ర‌పంచ చ‌రిత్ర‌లో ఎవ‌రూ ఉండ‌ర‌ని తిట్ట‌డం మొద‌లుప‌డితే.. తిడుతున్నార‌ని జీవో స‌వ‌రించాడు. స‌వ‌రించిందే కానీ, ఇంత వ‌ర‌కు పైసా ఇచ్చింది లేదు. 

ఇక పోలీస్ సోద‌రుల‌కు ఇచ్చే స‌రెండ‌ర్ లీవ్స్ 4 పెండింగ్‌. ఒక్కో స‌రెండ‌ర్ లీవ్‌కు రూ.210 కోట్లు అవుతుంద‌నుకుంటే.. అందులో రూ.100 కోట్లు ఇప్పుడిస్తాడ‌ట (అదీ ఇవ్వ‌లేదు), మిగిలిన రూ.100 కోట్లు జ‌న‌వ‌రిలో ఇస్తాన‌ని చెప్పాడు. ఇస్తాన‌దాంట్లో రూపాయి ఇవ్వ‌లేదు.. మ‌రి దీన్ని చూసి ఉద్యోగులంతా పండ‌గ‌ చేసుకోవాలంట‌. ఎలా  సంబ‌రాలు చేసుకోవాలి.. నాలుగింట్లో ఒక‌టి.. ఆ ఒక‌టిలో స‌గం.. చెప్పిన సగం కూడా ఇవ్వ‌లేదు.. మ‌ళ్లీ సంబ‌రాలు చేసుకోవాలంటున్నాడు.. ఎలా పండ‌గ చేసుకుంటారు

ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు తీపి తీపి మాట‌ల‌తో ఎంప్లాయీస్‌కు వైకుంఠం చూపించాడు. పాపం వాళ్లు నిజంగానే మోస‌పోయారు. తీరా ఇప్పుడు వారిని మోసం చేసి న‌డిరోడ్డున నిల‌బెట్టి చంద్ర‌బాబు వికృత ఆనందం పొందుతున్నాడు. 

టీడీపీ మేనిఫెస్టోలో ఉద్యోగుల గౌర‌వాన్ని పునఃప్ర‌తిష్ట చేస్తాన‌ని రాశాడు. తీరా ఇవాళ చూస్తే ప‌చ్చ బిళ్ల‌లు వేసుకొని గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీసుల్లోకి వెళ్లి.. టీడీపీ వాళ్లు దాడులు చేస్తున్నారు. ఏమైనా అంటే పొలిటిక‌ల్ గ‌వ‌ర్నెన్స్ అని నిర్మోహ‌మాటంగా అంటున్నారు.

ఓపీఎస్ అంటూ ఎన్నిక‌ల‌కు ముందు న‌మ్మ‌బ‌లికాడు. ఇవాళ మేం తెచ్చిన జీపీఎస్ లేదు. ఓపీఎస్ లేదు. జీపీఎస్ కోసం మేము యాక్ట్ తెస్తే.. ఇత‌ను రూల్స్ ఫ్రేమ్ చేసి రిలీజ్  చేసి ఉంటే.. జీపీఎస్ ఫ‌లితాలు ఈపాటికే ఉద్యోగ‌స్తుల‌కు వ‌చ్చేవి. అలాంటిది ఇవాళ ఉద్యోగ‌స్థుల‌కు జీపీఎస్ లేదు, ఓపీఎస్ లేదు.. త్రిశంక స్వ‌ర్గంలో ఉద్యోగులు ఉన్నారు. 

మ‌రోవైపున మేము తెచ్చిన జీపీఎస్‌ను కొనియాడుతూ కేంద్ర ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర్నుంచి అనేక రాష్ట్రాలు దీన్ని స్వీక‌రిస్తూ ముందుకుపోతున్నాయి. ఎన్నిక‌ల‌ప్పుడు ఉద్యోగుల‌కు మెరుగైన పీఆర్సీ అన్నాడు.. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఐఆర్ అన్నాడు.. ఎన్నిక‌లు అయిపోయాయి.. అధికారంలోకి వ‌చ్చాడు, ఐఆర్ గురించి మాట కూడా మాట్లాడ‌డు. పీఆర్సీ మ‌రీ దారుణం. ఎక్క‌డ పీఆర్సీ నిర్ణ‌యం త్వ‌ర‌గా వ‌స్తే.. ఎక్క‌డ ఉద్యోగ‌స్తుల జీతాలు పెంచాల్సి వ‌స్తుంద‌నే ఉద్దేశంతో.. మా ప్ర‌భుత్వంలో వేసిన‌ పీఆర్సీ చైర్మ‌న్‌ను ర‌ద్దు చేసి వెళ్ల‌గొట్టాడు. పీఆర్సీ కొత్త చైర్మ‌న్‌ను నియ‌మించ‌లేదు. నియ‌మిస్తే ఉద్యోగుల జీతాల పెంచాలి. 

ఐఆర్ ఇవ్వ‌క‌పోవ‌డం ఒక మోసం అయితే.. ఉద్యోగ‌స్తుల‌కు న్యాయంగా, ధ‌ర్మంగా పెర‌గాల్సిన జీతాల‌ను కుట్ర‌పూరితంగా అడ్డుకోవ‌డం అన్నింటికంటే దుర్మార్గం. ఉద్యోగుల‌కు ఇవ్వాల్సిన పీఆర్సీ బ‌కాయిలు, పెండింగ్ డీఏలు, జీపీఎఫ్‌లు, ఏపీజీఎల్ఐలు, మెడిక‌ల్ రీయింబ‌ర్స్‌మెంట్‌లో స‌రెండ‌ర్ లీవ్స్ మొత్తం దాదాపుగా రూ.31 వేల కోట్లు. ఇంత వ‌ర‌కు బ‌కాయిలు ప‌డ్డాడు. దీని గురించి మాట్లాడ‌డు. 

ఎన్నిక‌ల ముందు ప్ర‌తి నెలా ఒక‌టో తేదీనే ఉద్యోగ‌స్తుల‌కు జీతాలు అన్నాడు. పెన్ష‌న‌ర్ల‌కు పెన్ష‌న్లు అన్నాడు. ఎన్నిక‌లు అయిపోయాయి.. ఒక నెల ఇచ్చాడంతే.. ఈరోజు ఉద్యోగ‌స్తుల ప‌రిస్థితి ఏంటంటే.. నెల‌లో జీతాలు ఎప్పుడిస్తారో కూడా తెలియ‌దు. మేము మా ప్ర‌భుత్వ హ‌యాంలో కోవిడ్ లాంటి స‌మ‌స్య‌లు ఉన్నా.. రెండేళ్లు కోవిడ్ ప‌రిస్థితులు ఉన్నా.. అయినా ఏరోజూ కూడా ఉద్యోగ‌స్తుల జీతాల విష‌యంలో ఇబ్బందులు ప‌డే ప‌రిస్థితి తేలేదు. 

మా ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు ఉండి ఉంటే.. రాష్ట్రం అత‌లాకుత‌లం అయిపోయింది.. జీతాలు మీరు రెండు నెల‌లు వ‌దిలేసుకోండి.. రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండి అని పిలుపునిచ్చేవాడు డెఫినెట్‌గా. 

మ‌రోవైపు అవుట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ఉద్యోగ‌స్తుల‌కు ప్ర‌భుత్వ ప‌థ‌కాలు వ‌ర్తింప‌జేస్తాన‌ని హామీ ఇచ్చాడు. అస‌లు ఆ ఇచ్చే ప‌థ‌కాలే అర‌కొర‌. సూప‌ర్ సిక్స్‌-సూప‌ర్ సెవెన్‌లు గాలికి ఎగిరిపోయాయి. మా ప‌థ‌కాల‌న్నీ ర‌ద్దు అయిపోయాయి. ఆ ఇచ్చేవే అర‌కొర‌.. వాటిల్లో కూడా కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్ వాళ్ల‌కు ఇవ్వ‌డానికి చంద్ర‌బాబుకు మ‌న‌సు రావ‌డం లేదు. 

అధికారంలోకి రాగానే వాలంటీర్ల‌కు ఇచ్చే జీతం రూ.5 వేల నుంచి రూ.10 వేల‌కు పెంచుతాన‌న్నాడు.. ఎన్నిక‌ల స‌మ‌యంలో వాళ్ల‌కు ఆశ‌పెట్టి, ఉప‌యోగించుకొని, వాళ్ల‌పై కుట్ర చేసి ఎన్నిక‌లు అయిపోయిన త‌రువాత వాళ్ల‌ను రోడ్డు మీద ప‌డేశాడు. రూ.5 వేల నుంచి రూ.10 వేలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాల‌న్నీ పీకేశాడు. 2.66 ల‌క్ష‌ల మందిని రోడ్డున‌ప‌డేశాడు. 

మేము అధికారంలోకి వ‌చ్చిన వారం రోజుల్లోనే ఐఆర్ ఇచ్చి ఉద్యోగ‌స్తుల జీతాలు పెంచాం. 2019 మే 30న ప్ర‌మాణ‌స్వీకారం చేస్తే.. జూన్ 8న 27 శాతం ఐఆర్ ప్ర‌క‌టించి జూలై 1 నుంచి అమ‌లు చేశాం. అది ఉద్యోగ‌స్తుల మీద మాకున్న క‌మిట్‌మెంట్‌.

ఉద్యోగుల‌ను క్ర‌మ‌బ‌ద్ధీక‌రించాం
మా ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన వెంట‌నే 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల‌ను రెగ్యుల‌రైజ్ చేశాం. వారు ద‌శాబ్దాలుగా ధ‌ర్నాలు చేస్తున్నా ఎవరూ ప‌ట్టించుకోలేదు. వారంద‌ర్నీ గ‌వ‌ర్న‌మెంట్ ఎంప్లాయిస్ గా చేశాం. కాంట్రాక్టు ఎంప్లాయిస్ ని రెగ్యుల‌రైజ్ చేయ‌డం మొద‌లుపెట్టాం. 10,117 మందిని గుర్తించాం. ఇందులో 3,400 మందిని రెగ్యుల‌రైజ్ చేస్తూ ఆర్డ‌ర్స్ ఇచ్చాం. మిగిలిన వారికి అన్ని ప్ర‌క్రియ‌లు పూర్తి చేసి రెడీగా ఉన్నా ఎన్నిక‌ల ప్ర‌క్రియ వ‌ల్ల ఆగిపోతే వారిని ఇంత‌వ‌ర‌కు చంద్రబాబు రెగ్యుల‌రైజ్ చేయ‌లేదు. కాంట్రాక్టు ఉద్యోగుల‌కు జీతాలు టైమ్ స్కేల్ ఇచ్చి జీతాలు పెంచ‌డ‌మే కాకుండా వారికి ప్ర‌తినెలా ఒక‌టో తారీఖున జీతాలిస్తూ ప్ర‌భుత్వ‌మే అధికారికంగా ఏకంగా స‌ర్క్యుల‌ర్ ఇచ్చాం. ఇంత‌వ‌ర‌కు ప్ర‌భుత్వం స‌ర్క్కుల‌ర్ జారీ చేసి మెడ‌మీద క‌త్తిపెట్టుకునే కార్య‌క్ర‌మం ఎప్పుడూ జ‌ర‌గలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క‌ష్టాన్ని దోచుకునే అరాచ‌క విధానాల‌కు స్వ‌స్తి ప‌లికి ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను తీసేసి వారి బతుకులు మార్చాల‌నే ఉద్దేశంతో ఆప్కాస్ అనే ఔట్‌సోర్సింగ్ కార్పొరేష‌న్ క్రియేట్ చేసి ల‌క్ష మంది ఉద్యోగుల‌కు ఒక‌టో తారీఖునే జీతాలిచ్చేలా ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను తీసేసి మేలు చేశాం. ఈరోజు మ‌ళ్లీ ఆప్కాస్ ని నీరు గారుస్తున్నారు. చివ‌రికి గుడుల్లో భాస్క‌ర్ నాయుడు అనే చంద్ర‌బాబు బంధువును తీసుకొచ్చి ఆప్కాస్ ప‌రిధిలో ఉండే శానిటేష‌న్ వ‌ర్కులు కూడా వీళ్లే తీసుకున్నారు. 

ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచాం  
మేం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ప‌ద్ధ‌తిలో ప‌నిచేస్తున్న వారంద‌రీ జీతాలు పెంచాం. మేం అధికారంలోకి రాక‌ముందు ఏడాది వారి జీతాల‌కు అయ్యే ఖ‌ర్చు రూ. 1100 కోట్లు ఉంటే మేం వ‌చ్చిన వెంట‌నే రూ. 3300 కోట్లకు పెంచాం. కానీ నేడు  చంద్ర‌బాబు  నాయుడు స‌చివాల‌య ఉద్యోగుల వ‌ల్ల‌, ఆర్టీసీ ఉద్యోగుల వ‌ల్ల ఆప్కాస్ వ‌ల్ల జీతాలివ్వ‌డం క‌ష్టంగా ఉంద‌ని కొత్త‌కొత్త స్టోరీలు చెబుతున్నాడు. దీన‌ర్థం ఏంటంటే 52 వేల మంది ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల మీద చంద్ర‌బాబు క‌న్ను ప‌డింది. ల‌క్ష ఆప్కాస్ ఉద్యోగుల మీద క‌న్నుప‌డింది. దాదాపు 1.35ల‌క్ష‌ల పైచిలుకు ఉన్న ఉద్యోగుల మీద క‌న్నుప‌డింది. ఒక‌సారి వీళ్ల‌ను క్లీన్ చేశాడంటే త‌ర్వాత  మిగిలిన వారిని కూడా స్లోగా క్లీన్ చేయొచ్చ‌న్న‌ది ఆయ‌న దుర్భుద్ధి. 

విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన పూర్తిగా ఆగిపోయింది
ఉద్యోగుల‌కు ఎలాగూ చేయ‌డం లేదు. పోనీ ప్ర‌జ‌ల‌కు ఏమైనా చేస్తున్నాడా అంటే, అది కూడా గుండుసున్నా క‌నిపిస్తుంది. ఎప్పుడూ చూడ‌ని ప‌రిస్థితులు ఈరోజు క‌నిపిస్తున్నాయి. విద్య‌, వైద్యం, వ్య‌వ‌సాయం, గ‌వ‌ర్నెన్స్‌, లా అండ్ ఆర్డ‌ర్.. మొత్తం అన్నీ తిరోగ‌మ‌న‌మే కనిపిస్తుంది.  దేర్ ఈజ్ న‌థింగ్ ద‌ట్ చంద్ర‌బాబు నాయుడు కెన్ సే దీనివ‌ల్ల నేను మేలు చేయ‌గ‌లిగాను అని. స్కూళ్ల‌లో నాడు -నేడు ప‌నులు ఆగిపోయాయి. గోరుముద్ద క్వాలిటీ పోయింది. మూడో త‌ర‌గ‌తి నుంచి చెప్పే టోఫెల్ క్లాసులు ఎత్తేశారు. ఇంగ్లిష్ మీడియం చ‌దువులు గాలికి ఎగిరిపోయాయి. ఎనిమిదో త‌ర‌గ‌తి పిల్ల‌ల‌కు ఇచ్చే ట్యాబులు ఆగిపోయాయి. అమ్మ ఒడి అనేది అర‌కొర‌గా ఇచ్చార‌ని నేను చెప్పాల్సిన ప‌నిలేదు. విద్యాదీవెన‌, వ‌స‌తి దీవెన పూర్తిగా ఆగిపోయింది. 7 త్రైమాసికాల ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఒక్కో క్వార్ట‌ర్‌కి దాదాపు రూ.700 కోట్లు చెల్లించాలి. దాదాపు రూ.4500 కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది కేవ‌లం రూ. 700 కోట్లు. రెండేళ్లుగా వ‌స‌తి దీవెన రూ.2200 కోట్లు అస‌లు ఇవ్వ‌లేదు. గ‌తంలో జ‌న‌వ‌రిలో ఇచ్చేవాళ్లం. జ‌వ‌న‌రి 2024, జ‌న‌వ‌రి 2025కి పెండింగ్‌లో పెట్టారు. 

వైద్య‌రంగం అధోగ‌తిపాలు 
వైద్య‌రంగం చూస్తే రూ.25 ల‌క్ష‌లు దాకా పేద‌ల‌కు ఉచితంగా వైద్యం ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని నీరుగార్చేశారు. రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్ర‌తిపేద‌వాడికి ఉచితంగా వైద్యం అందించ‌డానికి నెల‌కు రూ.300 కోట్లు ఖర్చ‌వుతుంది. 17 నెల‌లుగా పెండింగ్‌లో పెట్టారు. దాదాపు రూ. 5100 కోట్లు చెల్లించాల్సి ఉంటే రూ. వెయ్యి కోట్లు కూడా ఇవ్వ‌లేదు. రూ.4 వేల కోట్లు బ‌కాయిలు. నెట్‌వ‌ర్క్ ఆస్ప‌త్రుల‌న్నీ చేతులెత్తేశాయి. ఈరోజు విజ‌య‌వాడ‌లో ధర్నా చేస్తున్నాయి. పేద‌వాడికి ఆరోగ్య భ‌రోసా ఇవ్వాల్సిన ఆస్ప‌త్రులు పేద‌వాడిని వ‌దిలేసి చంద్ర‌బాబు పుణ్యాన ధ‌ర్నా చేయాల్సిన దుస్థితి. ఆరోగ్య ఆస‌రా గాలికి ఎగిరిపోయింది. కుయ్ కుయ్ అంటూ రావాల్సిన 108, 104 అంబులెన్స్‌లు చంద్ర‌బాబు ఆఫీసులో ప‌నిచేసే తెలుగుదేశం పార్టీకి చెందిన డాక్టర్స్ వింగ్ అధ్య‌క్షుడికి చెందిన రూ.5 కోట్లు ట‌ర్నోవ‌ర్ కూడా లేని కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చేశారు. ఇలా స్కాములు చేస్తుంంటే అంబులెన్స్‌లు ఎలా న‌డుస్తాయి?  విలేజ్ క్లీనిక్‌లు, పీహెచ్‌సీలు, డిస్ట్రిక్ట్ ఆస్ప‌త్రులు, జీరో వేకెన్సీ రిక్రూట్‌మెంట్ పాల‌సీల‌న్నీ గాలికి ఎగిరిపోయిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మా హయాంలో డ‌బ్ల్యూహెచ్‌వో జీఎంపీ ప్ర‌మాణాలు క‌లిగిన మందులు ఆస్ప‌త్రుల్లో అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఆ మందులు దేవుడెరుగు. దూదికి దిక్కులేదు. ఇవ‌న్నీ ఒక‌వైపు ఉంటే మా హయాంలో తీసుకొచ్చిన 17 మెడిక‌ల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో 7 మెడిక‌ల్ కాలేజీలు పూర్తి చేశాం. రూ. 8 వేల కోట్ల‌కు గాను రూ.3 వేలకోట్లు మా హ‌యాంలోనే ఖ‌ర్చు చేశాం. మిగిలిన 10 మెడిక‌ల్ కాలేజీలు పూర్తి చేయడానికి సంవ‌త్స‌రానికి వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే స‌రిపోతుంది. కానీ వాటిని పూర్తి చేయ‌డం ఇష్టం లేక స‌గంలో ఉన్న కాలేజీల‌ను స్కాములు చేస్తూ ప్రైవేటుకి అమ్మ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. 

అక్టోబ‌ర్ 28న ర్యాలీలు
మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను నిర‌సిస్తూ కోటి సంత‌కాల కార్యక్ర‌మం ముమ్మ‌రంగా జరుగుతోంది. ర‌చ్చ‌బండ పేరుతో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ముమ్మ‌రంగా సాగుతున్న ఈ కార్య‌క్ర‌మం న‌వంబ‌ర్ 22 దాకా జ‌రుగుతుంది. ఉద్య‌మాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తూ అక్టోబ‌ర్ 28వ తారీఖున మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో ర్యాలీలు చేయాల‌ని పిలుపునిచ్చాం. అదేవిధంగా నవంబ‌ర్ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు జ‌రుగుతాయి. అలాగే న‌వంబ‌ర్ 23న రాష్ట్ర వ్యాప్తంగా సేక‌రించిన సంత‌కాల‌ను నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో సేక‌రించిన సంత‌కాల‌ను జిల్లా స్థాయికి ఫ్లాగ్ ఆఫ్ చేయించి పంపించ‌డం జ‌రుగుతుంది. నవంబ‌ర్ 24న కోటి సంత‌కాలు విజ‌య‌వాడ పార్టీ ఆఫీసుకి వ‌స్తాయి. ఆ త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్ గారి అపాయింట్‌మెంట్ తీసుకుని కోటి సంత‌కాలు తీసుకెళ్లి స‌బ్మిట్ చేస్తాం. చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్ర‌జ‌లు రెఫరెండం ఇచ్చారో గ‌వ‌ర్న‌ర్‌కి తెలియ‌జేస్తాం. 

రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి ఇంత ఘోరంగా ఉంది
రాష్ట్రంలో ఇప్ప‌టికీ డీఏపీ యూరియా దొర‌క‌ని ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి. రాయ‌ల‌సీమ ప్రాంతంలో బుడ్డ శెన‌గ విత్త‌నం అంటారు. సాగుకు సిద్ధంగా ఉంది. గ‌త నెల నుంచి స‌బ్సిడీ విత్త‌నాలు ఇస్తామ‌ని ప్ర‌క‌ట‌నలు చేశారే త‌ప్ప ఇంత‌వ‌ర‌కు కార్యాచ‌ర‌ణ లేదు. ఉల్లి రైతును గాలికొదిలేశారు. 60 రోజుల నుంచి కిలో రూ.3ల క‌న్నా దాట‌డం లేదు. ప్ర‌భుత్వం క్వింటా రూ.1200 ల‌కు ఇస్తామ‌ని చెప్పింది. ఎవ‌రికిస్తున్నారో ఎవ‌రికి తెలియ‌దు. ఇచ్చిందీ లేదు. ప్ర‌భుత్వంపైన రైతులు నిర‌స‌న తెలిపే స‌రికి రూ.50 వేలు ఇస్తామ‌ని చెప్పారు. రూ. 50 వేలు ఇచ్చేదానికి విధివిధానాలు రూపొందించ‌లేదు. ఎవ‌రికీ ఇచ్చింది లేదు. ధాన్యానికి గ‌తేడాది గిట్టుబాటు ధ‌ర లేక బ‌స్తా రూ. 1100 నుంచి రూ. 1200ల‌కు తెగ‌న‌మ్ముకునే ప‌రిస్థితి. ఈసారి ప‌రిస్థితులు ఎలా ఉంటాయో అర్థంకాక రైతులు ఆందోళ‌న చెందుతున్నారు. క్వింటా ప‌త్తి గ‌తంలో రూ.12వేలు ప‌లికితే ఇప్పుడు రూ. 5500లు ప‌ల‌క‌డం లేదు. అర‌టి గ‌తంలో రూ.28వేలు గ‌రిష్టంగా ప‌లికితే ఇప్పుడు రూ.3500ప‌లుకుతోంది. కూలీ ఖర్చులు కూడా రావ‌డంల లేద‌ని రైతులు టమోటాను పొలాల్లోనే వ‌దిలేస్తున్నారు. దెబ్బ‌తిన్న ఏ సీజ‌న్‌లో కూడా బీమా కానీ పంట న‌ష్ట‌ప‌రిహారం కానీ ఇవ్వ‌డం లేదు. అంతెందుకు ఇటీవ‌ల కురిసిన వ‌ర్షాల‌కు పంట న‌ష్టం జ‌రిగితే ఏ అధికారి కూడా వెళ్లి ఎన్యుమ‌రేష‌న్ కూడా చేయ‌డం లేదు. రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి ఇంత ఘోరంగా ఉంది.

మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. 

నకిలీ మద్యం తాగితే ప్రజలకు ప్రాణాలకు ఎలాంటి ఇబ్బందీ లేదని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాశాయి? దీన్ని ఏ విధంగా చూస్తారు?

వైయస్ జగన్ : వీళ్లంతా దొంగల ముఠా సభ్యులు కాబట్టి ఈ మీడియా సంస్థలు.. దోచుకో, పంచుకో, తినుకో అనే దాంట్లో ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి వీళ్లంతా సభ్యులు కాబట్టి నేచురల్ గా ఆదాయం అంతా వాళ్లకే పోతోంది కాబట్టి ప్రజలకు ఆరోగ్యం ఎలా జరిగితే మాకేం అనే ఉద్దేశంతో ప్రజల్ని తప్పుదోవ పట్టించేదాని కోసం ప్రజల ఆరోగ్యం కన్నా వీళ్ల లాభాలే మిన్న కాబట్టి తప్పుదోవ పట్టించే క్రమంలో వాళ్లు అలాగే చెబుతారు. అల్టిమేట్ గా నలుగురు చనిపోయిన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తున్నాం. కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారవుతోంది అనేది కంటికి కనిపిస్తోంది. ఫ్యాక్టరీలతో సహా వీళ్ల పెట్టుబడుల్లో, ఆదాయాల్లో వీళ్లకు వీళ్లకు మనస్పర్దలు వచ్చిన చోట పట్టుబడుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కనిపిస్తోంది. అమ్ముతున్నది కనిపిస్తోంది. అయినా కానీ వీళ్లకేమాత్రం కూడా స్పృహ లేదు. 

 మేం ఎక్కడా వ్యతిరేకించడం లేదు. మద్దతు ఇస్తున్నాం. మేం ఇనీషియేట్ తీసుకున్నాం కాబట్టే ఇది జరిగింది. పర్యావరణం గురించి ఎవరో మాట్లాడుతున్నారనే దానికి నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్పేది. రాష్ట్రం అన్నది ఏఐ యుగంలో ఉంది. ఏఐ యుగం, క్వాంటం కంప్యూటింగ్ ఈ యుగాల్లోకి పోతున్నాం. వీటన్నింటికీ హబ్ అనేది డేటా సెంటర్. డేటా సెంటర్ అనేది లేకపోతే ఫర్దర్ ఎవల్యూషన్ అనేది ఉండదు. డేటా సెంటర్ ఉంటేనే ఎకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. పవర్ రిక్వైర్మెంట్స్, వాటర్ గజిలింగ్ లాంటి కొన్ని సమస్యలు వచ్చినా సర్టైన్ కెపాసిటీ బిల్డ్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అప్పటి దాకా ప్రతి ఒక్కరూ దానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. 

డిఫరెన్స్ అనేది కనిపించేదేమిటంటే.. డేటా సెంటర్ల పరంగా డిఫరెన్స్ కనిపించదు. మనం చేసింది ఇంకా పెరుగుదలే ఈ ఫర్దర్ డేటా సెంటర్ యాడిషన్స్. కానీ మనం నాట్ ఓన్లీ డేటా సెంటర్, మీరు ఐటీ స్పేస్ కూడా కట్టాలి, తద్వారా 25 వేల ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టగలిగాం. వితిన్ టైమ్ ఫ్రేములో ఇవన్నీ కట్టాలి, రావాలి అని అగ్రిమెంట్ చేశాం. అది కూడా ఇది వీళ్లు చేయగలిగితే ఇంకా బెటర్ గా ఎకో సిస్టమ్ అనేది ఫాస్ట్ గా గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. 

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ అనేది దేశంలో ఎక్కడా లేదు, వారి వల్ల రాష్ట్రానికి ఆర్థిక భారం అని చంద్రబాబు అన్నారు?

గ్రామ, వార్డు సచివాలయాల మంచితనం అనేది చంద్రబాబుకు అర్థం కావడం లేదు కాబట్టే చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంది. ఈరోజు గవర్నెన్స్ అన్నది ఎందుకు ఫెయిల్ అయ్యింది అంటే దానికి ప్రధానమైన కారణం.. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఫెయిల్ కావడం. గ్రామ, వార్డు వాలంటీర్ల వ్యవస్థను తీసేయడం, పొలిటికల్ గవర్నెన్స్ ను తీసుకుని రావడం, ఎన్నికల హామీలకు ఈయన తూట్లు పొడవడం, ఈయనకు క్యారెక్టర్, క్రెడిబులిటీ లేదు కాబట్టి రాష్ట్రం ఈరోజు అతలాకుతలం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. 

పనీపాట లేని కన్వర్జేషన్ ను బాలకృష్ణ అనే వ్యక్తి అసెంబ్లీలో తీసుకొచ్చాడు. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి? ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగిన వాడిని అసెంబ్లీలో మాట్లాడించే కార్యక్రమం చేస్తున్నారు అంటే స్పీకర్ కు బుద్ధి లేదు. తాగినోడు ఆమాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆయన ఆమాదిరిగా  మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన్ను క్వశ్చన్ చేసుకోవాలి.

పనీపాట లేని కన్వర్జేషన్ ను బాలకృష్ణ అనే వ్యక్తి అసెంబ్లీలో తీసుకొచ్చాడు. అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంది? అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి? ఆయన తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగిన వాడిని అసెంబ్లీలో మాట్లాడించే కార్యక్రమం చేస్తున్నారు అంటే స్పీకర్ కు బుద్ధి లేదు. తాగినోడు ఆమాదిరిగా మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో, అసెంబ్లీకి వచ్చి ఆయన ఆమాదిరిగా  మాట్లాడుతున్నాడంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎట్లుందో ఆయన ఆయన్ను క్వశ్చన్ చేసుకోవాలి.

Back to Top