విశాఖపట్నం: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించడం.. ఈ రెండు ప్రధాన అంశాలుగా ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ను నిర్వహించామని, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ సదస్సుకు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించిందని, ప్రభుత్వం మీద, వైయస్ జగన్ నాయకత్వం మీద పారిశ్రామిక వేత్తలు పూర్తి విశ్వాసాన్ని చూపించారని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సీఎం వైయస్ జగన్ బ్రాండ్ కనిపించిందన్నారు. రెండు రోజుల సదస్సులో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 352 ఎంవోయూల చేసుకున్నామని, దీని ద్వారా రాష్ట్రంలోని 6 లక్షల పైచిలుకు మందికి ఉపాధి లభించనుందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు, యువతకు ఉపాధి కోసం, రాష్ట ఆర్థిక పరిస్థితులను బలోపేతం చేసేందుకు జీఐఎస్ దోహదపడుతుందన్నారు. విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్ ఏం మాట్లాడారంటే..
‘‘రాష్ట్రంలోని సహజ వనరులను ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని, దాదాపు 48 మినరల్స్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ గురించి, దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్లు నిర్మిస్తుంటే.. అందులో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్న అవకాశాన్ని జీఐఎస్ ద్వారా ప్రపంచానికి వివరించాం.
రాష్ట్ర విభజనలో ప్రధాన నగరాన్ని కోల్పోయాం. దానితో పోటీపడే అవకాశం ఉన్న ఏకైక నగరం విశాఖపట్నం. రాష్ట్రానికి విశాఖపట్నం లాంటి నగరం ఉండటం మన అదృష్టం. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలను కనెక్ట్ చేయడానికి కొన్ని పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేయాలని ఆలోచన చేసే క్రమంలో విశాఖ–చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై–బెంగళూరు, బెంగళూరు – హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో ఇప్పటికే ప్రభుత్వం పరిశ్రమల శాఖ ద్వారా 48 వేల ఎకరాలను సేకరించింది. రాష్ట్రంలో పరిశ్రమ స్థాపించాలంటే భూములు, విద్యుత్, నీటి వసతి, రోడ్డు కనెక్టివిటీ, మౌలిక వసతులు పారిశ్రామిక వేత్తలు కోరుకుంటారు. వీటితో పాటు అనుమతులు కూడా త్వరితగతిన అందాలనే ఆలోచనతో పారిశ్రామిక వేత్తలు ఉంటారు.
వైయస్ఆర్ ఏపీ–1 సింగిల్ విండో సిస్టమ్ ద్వారా 23 డిపార్టుమెంట్లకు సంబంధించి 96 క్లియరెన్స్లు కేవలం 21రోజుల్లో ఇచ్చేలా సింగిల్ విండో సిస్టమ్ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. గడిచిన మూడున్నర సంవత్సరాల్లో పరిశ్రమలకు 12 రోజుల్లోనే క్లియరెన్స్లు ఇస్తున్నాం. దీనితో పాటు భూకేటాయింపులు కూడా త్వరగా పూర్తికావాలని సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. ఈజ్ ఆఫ్ డూయిగ్ బిజినెస్లో నంబర్ .1 స్థానంలో ఉన్నాం. 2021–22లో రూ.1.44 లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ చేశాం. ఎక్స్పోర్ట్స్లో రెండు అంకెల స్థానం నుంచి 4, 5 స్థానాల్లోకి రాష్ట్రాన్ని తీసుకువచ్చాం. దేశంలో 8వ అతిపెద్ద రాష్ట్రంగా దాదాపు 5.30 కోట్ల మంది ప్రజల్లో 70 శాతం వర్కింగ్ ఏజ్గ్రూప్, స్కిల్డ్ వర్క్ఫోర్స్ ఉన్న రాష్ట్రంగా, 300 పైచిలుకు ఇంజినీరింగ్కాలేజీలు ఉండి.. ప్రతి సంవత్సరం ప్రొఫెషనల్ కోర్సులు చేసి పెద్ద ఎత్తున బయటకు వస్తున్న స్కిల్డ్ యూత్ అందుబాటులో ఉన్న రాష్ట్రంగా ఏపీ ఉంది. మన రాష్ట్రంలో హ్యూమన్ రిసోర్స్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంది.
14 సెక్టార్లను ఎంపిక చేసుకొని వాటిపై ఫోకస్ చేశాం. ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అవకాశాలున్నాయి. ఫార్మారంగంలో కొన్ని ప్రత్యేకమైన మెడిసిన్ డ్రగ్స్ ప్రపంచానికే మేజర్గా సప్లయ్ చేస్తున్న రాష్ట్రం ఏపీ. దేశం నుంచి ఎక్స్పోర్టు అయ్యే దాంట్లో 65 శాతం రొయ్యల ఎక్స్పోర్టు మన రాష్ట్రం నుంచే జరుగుతుంది. అలాగే చేపల ఎక్స్పోర్టులో 45 శాతం మన రాష్ట్రం నుంచే జరుగుతుంది. చాక్లెట్ తయారీలో ఉపయోగించే కొక్కోవా అల్లూరి సీతారామరాజు జిల్లా అధికంగా సప్లయ్ చేస్తున్నాం. కొక్కోవా ఎక్స్పోర్టులో దేశంలో నంబర్ వన్ స్థానంలో ఉన్నాం. ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ రంగానికి సంబంధించి సెకండ్కు ఒక మొబైల్ను ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తోంది.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి టీసీఎల్ లాంటి దిగ్గజ కంపెనీని రాష్ట్రానికి ∙తీసుకొచ్చారు. సామ్సంగ్, ఎల్జీ వంటి మేజర్ కంపెనీల టీవీల డిస్ప్లే ప్యానల్స్ ఆంధ్రప్రదేశ్లో తయారవుతున్నాయి. యాపిల్, సామ్సంగ్, ఎల్జీ మొబైల్ ఫోన్లకు సంబంధించిన చార్జింగ్ వైర్స్, ఇయర్ ఫోన్స్ వైర్స్ మన రాష్ట్రంలో తయారవుతున్నాయి. మొబైల్ ఫోన్స్ బ్యాక్ కెమెరాలు తయారుచేసే సన్నీ ఓపోటెక్ కంపెనీ వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే వచ్చింది. తిరుపతిలో ప్రారంభించాం. ఈ కంపెనీ రోజుకు కొన్ని లక్షల కెమెరాలు తయారు చేస్తుంది. సీసీప్లస్ అనే సీసీ కెమెరాల తయారీ యూనిట్ కడపలో ఏర్పాటు చేశాం. సీసీ కెమెరాల మ్యానిఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లా శ్రీసిటీలో క్యాడ్బరీ చాక్లెట్ ప్రొడక్ట్స్ జరుగుతున్నాయి. బ్లూస్టార్ ఏసీ, ప్యానసోనిక్ ప్రొడక్ట్స్, హేవెల్స్ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, అగ్రికల్చర్ బేస్డ్ అనేక రకాల అవకాశాలు, రెన్యూవబుల్ ఎనర్జీ,
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 10 గిగావాట్ కెపాసిటీ కలిగిన సోలార్ ప్రాజెక్ట్ను రూ.40 నుంచి 50 వేల కోట్ల పెట్టుబడితో ఏపీలో స్థాపించబోతున్నాం అని దిగ్గజ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ ప్రకటించారు. రెన్యూవబుల్ ఎనర్జీకి కావాల్సిన మేజర్ రిసోర్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సహజ సిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన అవకాశాన్ని వెలికితీసే బాధ్యత, నాయకత్వం ప్రభుత్వానిది. ఆ నాయకత్వం రాష్ట్రానికి ఉంది కాబట్టి ప్రాజెక్టులు వస్తున్నాయి.
ఉమ్మడి రాష్ట్రంలోనూ 974 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని ఫోకస్ చేశారా..? సోలార్ పవర్ను, విండ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ఆలోచనలు గతంలో మనం ఎప్పుడూ వినలేదు. సోలార్ ఎనర్జీకి సంబంధించి 38 గిగావాట్ల కెపాసిటీ ప్రొడ్యూస్ చేసేందుకు రాష్ట్రంలో అవకాశాలు ఉన్నాయి. 44 గిగావాట్లతో విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయడానికి ఏపీలో అవకాశాలు ఉన్నాయి. పంప్డ్ స్టోరేజీకి సంబంధించి 29 లొకేషన్స్, 33 గిగావాట్లకు సంబంధించి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో గుర్తించింది
గతంలో ఏ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్న వనరులు, మౌలిక వసతుల గురించి ప్రచారం చేయలేదు. ఏ కంపెనీకి అనుమతి ఇచ్చినా, ప్రతిదీ పూర్తి పారదర్శకం. అన్నీ ఓపెన్ ఫోరమ్లో పెడుతున్నాం. చంద్రబాబు కూడా ఇక్కడ సౌర విద్యుత్, పవన విద్యుత్ ప్లాంట్ పెడతామంటే అనుమతి ఇస్తాం.
మారిటైమ్ బోర్డు ఏర్పాటు చేశాం. 4 పోర్టులు వేగంగా నిర్మిస్తున్నాం. దాదాపు రూ.3200 కోట్లతో రామయ్యపట్నం పోర్టు, 9 బెర్తులతో నిర్మిస్తున్నాం. ఈ ఏడాది డిసెంబరు నాటికి మొదటి దశ అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నాం. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన మచిలీపట్నం పోర్టు విస్తరణకు 20 రోజుల్లో పనులు మొదలు పెట్టబోతున్నాం. భావపనాడు పోర్టు, కాకినాడ పోర్టు నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఆ విధంగా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి జరుగుతోంది.
అయినా అదే పనిగా పరిశ్రమలపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది గత మూడేళ్లుగా సాగుతోంది. విశాఖలో జీఐఎస్లో పారిశ్రామికవేత్తల మాటలను ఇకనైనా విపక్ష నేతలు గమనించాలి. అవాస్తవాలు ప్రచారం చేయడం మానాలి. ఇక్కడి నుంచి కంపెనీలు వెళ్లిపోతున్నాయన్న విమర్శలు వీడాలి. దేశం గర్వపడే ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రపంచంలోనే టాప్ టెన్లో ధనికులుగా ఉన్న వారు, సీఎం గురించి ఎంత బాగా చెప్పారో చూశాం. ఆయన పారిశ్రామికవేత్తలకు కల్పించిన విశ్వాసం చాలా గొప్పది.
జీఐఎస్లో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు, 6 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. అయితే గత మూడున్నర ఏళ్లుగా పలు పరిశ్రమలతో మేము చేసుకున్న ఎంఓయూల్లో 89 శాతం కార్యరూపం దాల్చాయి. అది మా ఘనత-మా ట్రాక్ రికార్డు. అందుకే ఇప్పటి ఎంఓయూలు కూడా తప్పనిసరిగా కార్యరూపం దాలుస్తాయి. ఆ దిశలో ఇప్పటికే సీఎస్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పారిశ్రామికవేత్తలకు కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తాం. వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూస్తాం.
మా ఆహ్వానాన్ని మన్నించి చాలా మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు విశాఖకు వచ్చారు. వారిలో సీఎం మంచి విశ్వాసాన్ని పెంపొందించారు. సీఎస్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ప్రతి వారం సమావేశం అవుతుంది. ప్రతి నెలా సీఎం స్వయంగా సమీక్షిస్తారు. వచ్చే కొన్ని నెలల్లో, నెలకు కనీసం రెండు పరిశ్రమలు గ్రౌండ్ అయ్యే విధంగా చర్యలు చేపడతాం. పారిశ్రామికవేత్తల్లో మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. జీఐఎస్పై దేశ వ్యాప్తంగా ఇప్పటికే చర్చ మొదలైంది.
విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు.. మూడు నగరాలను ఐటీ కాన్సెప్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం. ఇంకా టూరిజమ్, హాస్పిటాలిటీ రంగాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాం.
2019లో మేము అధికారంలోకి వచ్చాక, ఏపీఐఐసీకి సంబంధించి ఒక పాలసీ తీసుకొచ్చాం. పరిశ్రమలకు అవసరమైన భూములు ఇవ్వడంలో నిర్దిష్ట విధానాలు రూపొందించాం. గతంలో పరిశ్రమలకు భూమి ఇస్తూ, సేల్ డీడ్ చేసే వారు. దాని వల్ల కొన్ని ఇబ్బందులు రావడంతో.. ఆ సేల్ కాన్సెప్ట్ తొలగించి, లీజ్ విధానంలో భూములు కేటాయిస్తున్నాం. ఆ మేరకు లీజ్ డీడ్ చేస్తున్నాం. పరిశ్రమల వారు చెప్పినట్లుగా పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన జరిగిన తర్వాతే.. సేల్ డీడ్ చేస్తున్నాం. ముందు లీజ్ డీడ్. పరిశ్రమల యాజమాన్యాలు మాట నిలబెట్టుకున్న తర్వాత, సేల్ డీడ్. అదే మేము తీసుకొచ్చిన విధానం.
ఓవరాల్గా ఒక విషయం గర్వంగా చెప్పగలం. విశాఖకు ఈ సదస్సు ద్వారా బ్రాండ్ ఇమేజ్ ఏర్పడింది. ఇక్కడి వాతావరణం, అనుకూలమైన పరిస్థితులు, మౌలిక వసతులు.. అన్నీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిశాయి. కాబట్టి విశాఖ రానున్న రోజుల్లో దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడగలుగుతుంది. జీఐఎస్ ఎంఓయూలు చాలా వేగంగా కార్యరూపం దాల్చేలా చిత్తశుద్ధితో కృషిచేస్తాం’’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు.