బీసీలకు రాజ్యాధికారం అంటే బాబు పల్లకీ మోయడమేనా ప‌వ‌న్‌..?

ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా

కృష్ణ: మూడు నెలల తర్వాత బయటికొచ్చి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ హడావిడి చేస్తూ.. బీసీలు, కాపులు కలిసి రాజ్యాధికారం చేపట్టాలని మాట్లాడుతున్నాడని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. తుని రైలు దహనం కేసు ఘటనలో విజయవాడ రైల్వే కోర్టుకు మంత్రి దాడిశెట్టి రాజా, ఇతర కాపు నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు రాజ్యాధికారం అంటే చంద్రబాబు పల్లకీ మోయడమేనా అంటూ మండిపడ్డారు. కొత్తగా చంద్రబాబుతో కలిసి ఉన్నట్లు పవన్ మాట్లాడుతున్నాడని, వాళ్లిద్దరూ 2014 నుంచి కలిసే ఉన్నారన్నారు. చంద్రబాబుకు, తనకు కాపులు ఓటేయకపోతే బీసీలు బానిసలైపోతారనేలా పవన్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడన్నారు. కాపులతో పాటు ఎస్సీ, ఎస్టీల పై కేసులు ఎందుకు పెట్టావని చంద్రబాబుని అడిగావా పవన్‌..? అని మంత్రి రాజా ఫైర్‌ అయ్యారు. కాపు సేవా సమితి పేరుతో హరిరామజోగయ్య హడావిడి చేస్తున్నారని, కాపు సేవా సమితిని కమ్మ సేవా సమితిగా మార్చుకుంటే మంచిదన్నారు. ఈనెల 14న పవన్ యాక్టింగ్‌ను బట్టి అతని ప్యాకేజ్ ఉంటుందని, అదే రోజు నాటు నాటు పాటకు మించి పవన్ డాన్సు ఉంటుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చే స్కిప్ట్‌నే రేపు పవన్‌ చదువుతాడని,  ఆర్‌ఆర్‌ఆర్‌కు వచ్చిన ఆస్కార్‌ కంటే పవన్‌ యాక్టింగే ఆస్కార్‌లా ఉండబోతోందన్నారు. పవన్‌ యాక్టింగ్‌ బట్టి అతని ప్యాకేజీ ఉంటుందన్నారు.

తాజా వీడియోలు

Back to Top