మూడేళ్ళలోనే 99 శాతం హామీలు అమలు చేయడం దేశంలోనే ఓ చరిత్ర

బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి  చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ 

 ఇచ్చిన హామీలు ఎలా ఎగ్గొట్టాలనేది బాబు విధానం

 ఇచ్చిన హామీలను ఎలాగైనా అమలు చేయాలన్నది జగన్ గారి విశ్వసనీయత

 చంద్రబాబు రాజకీయాలను భ్రష్టుపట్టించాడు.. రాజకీయాల్లో ఉండే అర్హతే లేదు 

రామ‌చంద్రాపురం:   సీఎం వైయ‌స్‌ జగన్‌గారు సత్యం మాట్లాడతారు, చెప్పింది చేస్తారు, చేయగలిగిందే చెప్తారు అని ప్రజలు విశ్వసిస్తున్నార‌ని మంత్రి వేణు గోపాలకృష్ణ  పేర్కొన్నారు. దీనికి వాస్తవ రూపంగానే రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోంద‌న్నారు.  ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99(98.44శాతం) శాతం ఇప్పటికే, అంటే మూడేళ్ళలోనే అమలు చేశాం. ప్రజలకు చెప్పినవన్నీ అమలు చేశారు.  దేశ చరిత్రలో మరే రాజకీయ పార్టీగానీ, రాజకీయ నేతగానీ ఇలా చేయలేదు. 

అక్టోబరు 1 నుంచి వైయస్సార్‌ కళ్యాణమస్తు, వైయస్సార్‌ షాదీ తోఫా పథకాలు అమల్లోకి వస్తున్నాయి.  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికులు.. ఇలా ఎందరో పేదరికంలో ఉన్న కుటుంబాలు.. వివాహ సమయాల్లో ఆర్థికంగా కుంగిపోతారు, అప్పులు పాలవుతారు.  ఇలాంటి సమయాల్లో వారిని ఆదుకోవడానికి ఈ పథకాన్ని ముఖ్యమంత్రిగారు ప్రకటించారు. గత ప్రభుత్వం కంటే అధికంగా కళ్యామస్తు కింద ఈ ప్రభుత్వం ఇవ్వనుంది. 

మా మేనిఫెస్టోను  భగవద్గీతగా, ఖురాన్‌గా, బైబిల్‌గా ముఖ్యమంత్రి జగన్ గారు భావించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఇలాంటి పథకాన్ని ప్రకటించి సుమారు 17వేలమందికిపైగా జంటలకు ఎలాంటి చెల్లింపులు చేయకుండా, సుమారు 68 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దిగిపోయాడు. 

 చంద్రబాబు 2014 మేనిఫెస్టోలో 600కు పైగా హామీలు ఇచ్చి... వాటిని పూర్తిగా ఎగ్గొట్టిన ఘనుడు. ఇవ్వడానికే హామీలు గానీ, అమలు చేయడానికి కాదు అన్నుట్టుగా చంద్రబాబు వ్యవహరించారు. ప్రజలు అడగరని, ఎన్నికల తర్వాత వారికి గుర్తుండదని, మరచిపోతారన్నది.. చంద్రబాబు భావన. చంద్రబాబుకు మనస్సాక్షి అనేదే లేదు.

 చంద్రబాబు హయాంలో మొత్తంగా రాజకీయ వ్యవస్థపైనే నమ్మకం సడలిపోయింది. అపనమ్మకం పెరిగింది.  మొత్తం రాజకీయ వ్యవస్థను భ్రష్టుపట్టించాడు చంద్రబాబు. రాజకీయ వ్యవస్థపట్ల నమ్మకం, రాజకీయాల్లో విశ్వసనీయత, పారదర్శకత తీసుకు వచ్చిన నాయకుడు వైయస్‌.జగన్‌ గారు.. జగన్‌ గారు అంటే ఒక నిజం. 

 చంద్రబాబు హామీలు ఇచ్చి.. ఎప్పుడైనా అమలు చేశారా? రైతులకు రుణమాఫీ చేస్తానంటూ.. హామీ ఇచ్చి ఎగ్గొట్టాడు. వ్యవసాయ రుణ మాఫీకి సంబంధించి, కోటయ్య కమిటీ వేసి.. చివరకు రూ.25వేల కోట్లు తేల్చి, చివరికి ఇచ్చింది ఐదేళ్లలో రూ.15వేల కోట్లే. చంద్రబాబు ఆలోచనలన్నీ.. ఇచ్చిన హామీలు ఎలా ఎగ్గొట్టాలని చూస్తే.. జగన్ గారు ఎలా అమలు చేయాలని చూశారు కాబట్టే, జగన్ గారిని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆదరిస్తున్నారు. 

  చంద్రబాబు హయాంలో ఉన్నదీ, ఇప్పుడున్నదీ అదే బడ్జెట్‌ అయినా, ఒకవైపు చంద్రబాబు చేసిన అప్పుల భారాన్ని మోస్తూ మరోవైపు వైయస్‌.జగన్‌గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారు. మా ప్రభుత్వం మూడేళ్ళలోనే రూ. 1.65 లక్షల కోట్లు డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలకు ఖర్చు చేసింది.  కానీ, ప్రజల దృష్టిని మరల్చడానికి చంద్రబాబు నానా కుట్రలు, ప్రయత్నాలు చేస్తున్నారు. 

 చంద్రబాబు చేస్తున్నవన్నీ దారుణాతి దారుణమైన కుట్ర రాజకీయాలు. ప్రజలను ఎలా మోసం చేయాలి. మోసం చేసి, తద్వారా ఎలా అధికారంలోకి రావాలి? వచ్చిన తర్వాత ఎలా దోచుకోవాలి? దోచుకున్న దాన్ని, తనవారికి ఎలా పంచుకోవాలి.. వారి ద్వారా ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని ఎలా అబద్ధపు ప్రచారాలు చేసుకోవాలి.. ఇదే చంద్రబాబు రాజకీయ విధానం. 
– రాష్ట్రంలో ఏదో ఒక అశాంతిని సృష్టించి.. అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. ఎన్టీఆర్‌ బతికున్నప్పటి నుంచి కూడా చంద్రబాబు ఆలోచన ఇదే. కుటుంబాలను విడదీసి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న నీచ సంస్కృతి చంద్రబాబుది. 

 అమరావతి రైతుల పేరుతో పాదయాత్రలు చేయించి రాష్ట్రంలో అశాంతిని సృష్టించాలన్నది చంద్రబాబు కుట్ర.  పరిపాలనా రాజధానిగా విశాఖను చేయాలన్నదే మా ప్రభుత్వ నిర్ణయం. ఒకే ఒక సామాజిక వర్గం ఉన్న అమరావతి తప్ప.. మరేదీ రాజధాని కాకూడదన్నది చంద్రబాబు అండ్ కో.. కుట్రలు పన్నుతున్నారు. ఏ ముఖం పెట్టుకుని మీరు పాదయాత్ర చేస్తున్నారు...?. పాదయాత్ర ద్వారా,  రాష్ట్రంలో కులాలు, ప్రాంతాల మధ్య అశాంతిని, గొడవలను సృష్టించాలన్నదే మీ ఉద్దేశమా..?. పాదయాత్ర ద్వారా ప్రజలను రెచ్చగొట్టాలన్నదే మీ ధ్యేయమా..?.  

 పాదయాత్రలో.. ఎక్కడైనా ఏదైనా జరగకూడని ఘటనలు జరిగితే.. దానికి బాధ్యత చంద్రబాబే వహించాలి.
– చంద్రబాబు హైదరాబాద్ కట్టలేదు, రాష్ట్ర సంపదను పెంచలేదు గానీ...  హైదరాబాద్‌లో తన కోసం పెద్ద భవంతిని కట్టుకున్నాడు. తన వాళ్ల కోసం భూములను దోచి పెట్టాడు, తన వాళ్ల ఆస్తులను పెంచుకున్నాడు, తద్వారా తన ఆస్తులను, సంపదను పెంచాడు. చంద్రబాబు వల్ల అప్పుడూ, ఇప్పుడూ రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు. రాజకీయాల్లో ఉండటానికి కూడా బాబుకు అర్హత లేదు. 

Back to Top