కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
చైర్మన్ పోడియం ఎక్కిన టీడీపీ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలి
23 Mar 2022 1:18 PM
మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
అమరావతి: శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యుల తీరు బాధాకరమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సభ సజావుగా జరగనివ్వకుండా చైర్మన్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. టీడీపీ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియం ఎక్కి గందరగోళ వాతావరణాన్ని సృష్టించడంపై మంత్రి బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ సభ్యుల తీరు బాధాకరమని, గందరగోళం సృష్టించడం మంచిపద్ధతి కాదన్నారు. చైర్మన్ స్థానాన్ని టీడీపీ సభ్యులు అగౌరవ పరుస్తున్నారని, పోడియంపైకి ఎక్కిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.