పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు?
వైయస్ఆర్ స్మృతి వనం అభివృద్ధికి చర్యలు
19 Jun 2019 4:47 PM
మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి
అమరావతి : పావురాల గుట్టలో ఉన్న వైయస్ఆర్ వైయస్సార్ స్మృతి వనాన్ని రూ. 25 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. బుధవారం అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది 25 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అటవీ విస్తీర్ణంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. ఎర్రచందనం అమ్మకాల ద్వారా ఇప్పటివరకూ రూ. 1688 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు. ఎర్రచందనం పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని..5 వేల మెట్రిక్ టన్నుల ఎర్రచందనం అమ్మకానికి కేంద్రం అనుమతి కోరామని తెలిపారు. అదే విధంగా రాష్ట్రంలో పెరిగిపోతున్న కాలుష్య నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. ఇక వన్యప్రాణుల దాడుల్లో మృతి చెందిన వారికి రూ. ఐదు లక్షల పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.