ప్రకాశం: అకాల వర్షం నేపథ్యంలో మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలనీల్లో పారిశుద్ధ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెడ్జోన్ ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నగర శివారు కాలనీలు, కూరగాయలు మార్కెట్లలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.