సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు
09 May 2020 11:09 AM
మంత్రి అవంతి శ్రీనివాస్
విశాఖ: గ్యాస్ లీకేజీ ఘటనపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ సూచించారు. శనివారం వెంకటాపురం గ్రామంలో మంత్రి పర్యటించి, అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎల్సీ పాలీమర్స్లో పరిస్థితి పూర్తి అదుపులో ఉందన్నారు.మరో 24 గంటల్లో పూర్తి స్థాయి సాధారణ పరిస్థితులు నెలకొంటాయన్నారు. ఇవాళ కేంద్రం నుంచి నిపుణులు వస్తున్నారని చెప్పారు. నిపుణుల సూచనల మేరకు గ్రామాల్లోకి అనుమతిస్తామన్నారు. బాధితులకు పునరావాస కేంద్రంలో అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.