పోలవరంలో మంత్రి అనిల్‌ పర్యటన

పశ్చిమ గోదావరి: ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం, పనుల పురోగతికి సంబంధించిన విషయాలను ఉన్నతాధికారులు, ఇంజినీర్లను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 

Back to Top