ఏపీ ప్రభుత్వ ఎన్నారై సలహాదారుగా మేడపాటి వెంకట్‌

 

 అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రవాసాంధ్రుల సలహాదారుగా మేడపాటి వెంకట్‌ నియమితులయ్యారు. అదే విధంగా ఏపీ ఎన్నార్టీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం జీవో జారీచేసింది. కాగా గతంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ కన్వీనర్‌గా మేడపాటి వెంకట్‌ పనిచేశారు. మరోవైపు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ను నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి అధికార భాషా సంఘం కొనసాగుతుందని జీవోలో పేర్కొంది.

Back to Top