ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?

శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ఫైర్‌

రైతులు, విద్యార్థుల స‌మ‌స్య‌ల‌పై ఉద్య‌మిద్దాం

కాకినాడ‌లో ఉమ్మ‌డి గోదావ‌రి జిల్లాల పార్టీ నేత‌ల‌తో స‌మీక్షా స‌మావేశం

కాకినాడ: ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?.. పంట నష్టపోయిన రైతులకు ఎప్పుడు పరిహారం అందిస్తారంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేత, శాస‌న మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడలో ఉమ్మడి గోదావరి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ  సమీక్షా సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, దాడిశెట్టి రాజా, వైయ‌స్ఆర్‌సీపీ  నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీలు వంగా గీతా, చింతా అనురాధ హాజరయ్యారు.

ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ..విద్యార్థులు, రైతులు, విద్యుత్ బిల్లుల పెంపుపై పోరాటం చేయాలని వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. ప్రజల తరపున గొంతెత్తాలి.. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి. ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఈ నెల 13న రైతు సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. ఈ నెల 27న విద్యుత్‌ బిల్లుల పెంపుపై ఉద్యమిస్తాం. జనవరిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఉద్యమిస్తాద్దామ‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు. 

Back to Top