రైతాంగానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ద‌న్నుగా నిల‌బ‌డ్డారు

మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు

 పంట న‌ష్ట‌ప‌రిహారం ఏ సీజ‌న్‌కు ఆ సీజ‌న్‌లోనే అందిస్తున్నాం

ఆర్బీకే అనేది క్షేత్రస్థాయి వ్యవస్థ

కాకినాడ:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రైతాంగానికి ద‌న్నుగా నిల‌బడ్డార‌ని మాజీ మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు పేర్కొన్నారు. ఏపీలో ధాన్యం కొనుగోళ్లు, ఆర్బీకేపై ఎమ్మెల్యే కురసాల కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖరీఫ్‌లో రూ.7,233 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పారు.   ఎమ్మెల్యే కన్నబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్బీకే అనేది క్షేత్రస్థాయి వ్యవస్థ. ఆర్బీకేల ద్వారా రైతులకు అన్ని రకాల సేవలు అందుతున్నాయి. రాష్ట్రంలో 6.45లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశాం. ఖరీఫ్‌లో రూ.7,233 కోట్ల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. 99 శాతం చెల్లింపులు జరిగాయి. రైతులు ఇబ్బంది పడకూడదనే వెంటనే చెల్లింపులు చేశాం అని తెలిపారు. 

Back to Top