వైయ‌స్ఆర్‌సీపీలోకి గోక‌రాజు గంగ‌రాజు సోద‌రులు  

తాడేప‌ల్లి: ప‌్ర‌ముఖ పారిశ్రామిక వేత్త గోకరాజు రంగ‌రాజు కుటుంబం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌మ‌క్షంలో గోక‌రాజు రంగ‌రాజు పాటు మాజీ ఎంపీ గోక‌రాజు గంగ‌రాజు సోద‌రులు రామ‌రాజు, న‌ర‌సింహ‌రాజు కూడా వైయ‌స్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల‌నలో ప్ర‌జ‌లంతా సంతోషంగా ఉన్నార‌ని, ఆరు నెల‌ల్లోనే అనేక సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేశార‌న్నారు. సీఎం నాయ‌కత్వంలో ప‌నిచేయ‌డం అదృష్టంగా భావిస్తున్నాన‌న్నారు.  

Read Also: మహిళల భద్రతకోసం కొత్త బిల్లు

Back to Top