తాడేపల్లి: టీమిండియా మాజీ కోచ్, భారత టెస్టు జట్టు మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య క్రీడల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఏపీలో స్పోర్ట్స్ యూనివర్శిటీ పెడితే తన వంతు సహకారం అందిస్తానని అనిల్ కుంబ్లే సీఎం వైయస్ జగన్కు చెప్పారు. అంతేకాక క్రీడా సామగ్రి తయారీ ఫ్యాక్టరీని పెట్టే అంశంపైనా దృష్టిసారించాలని సీఎంను కోరారు. ప్రస్తుతం జలంధర్, మీరట్ లాంటి నగరాలనుంచే అన్నిరకాల క్రీడా సామగ్రిని తెచ్చుకుంటామని, ఇక్కడ ఫ్యాక్టరీ పెడితే క్రీడా సామగ్రి అందరికీ అందుబాటులో ఉంటుందని వివరించారు. దీనికి సంబంధించి తన అనుభవాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నానని కుంబ్లే సీఎం వైయస్ జగన్ తెలిపారు.