నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కోసం సైనికుడిలా పని చేస్తానని మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వైయస్ జగన్ బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని దుయ్యబట్టారు. ఫేక్లే పార్టీ మారతారు.. నిజంగా వైయస్ జగన్ను అభిమానించేవారు పార్టీ మారరని పేర్కొన్నారు. మంగళవారం అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ల్లూరు సిటీ నుంచి వైయస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఖలీల్ పోటీ నెల్లూరు సిటీ నుంచి వైయస్ఆర్ సీపీ అభ్యర్థిగా ఖలీల్ పోటీ చేస్తారని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. 2009 నుంచి మూడు సార్లు నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశాను.. మొదటిసారి కొద్దిగా ఓడిపోయినా.. రెండుసార్లు విజయం సాధించాను.. ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నాను.. కష్టకాలంలో నా వెంట ఉన్న వారి రుణాన్ని తీర్చుకోలేను.. వైయస్ జగన్ కోసం సైనికుడిలా పని చేస్తాను.. ఆయన ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తాను అని స్పష్టం చేశారు.తాను చనిపోయిన తర్వాత తన శవంపై పార్టీ జెండా వైయస్ జగన్ కప్పాలని బహిరంగంగా చెప్పిన నేత పార్టీ మారారు.. అందుకే ఎవరిని నమ్మాలన్నా భయం వేస్తుందన్నారు..వైయస్ జగన్ బాగా నమ్మినవారిలో కొందరు ఆయననే మోసం చేశారని దుయ్యబట్టారు.. రేపు నరసరావుపేటకు వెళ్తున్నా.. రేపు నరసరావుపేటకు వెళుతున్నా.. అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ నాకు సన్నిహితులే.. అంతా కలిసికట్టుగా పని చేస్తామని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ ప్రాంతం (నెల్లూరు) నాకు అన్నీ ఇచ్చింది.. వీరి దీవెనల వల్లే నరసరావుపేటలో కూడా రాణిస్తా అన్నారు. నాకు ఎవరి మీదా కక్ష్య లేదన్న ఆయన.. నాకు ఎందరో సహకరించారు.. నెల్లూరు సిటీకి అభ్యర్థిగా మైనారిటీ కి వైయస్ జగన్ అవకాశం కల్పించారు.. ఒకరిద్దరు నాయకులు వెళ్లినా ఇబ్బంది లేదన్నారు. పార్టీ ఏమీ బలహీన పడదు.. కొత్త వారిని తీసుకు వస్తాం.. నేత మారినప్పుడు కొందరు వెళ్లడం సహజమే అన్నారు. నెల్లూరు వదిలి వెళుతున్నందుకు బాధగా ఉన్నా.. జగనన్న నన్ను పోటీ చేయమని చెప్పారు.. ఎవరికీ దొరకని అవకాశం నాకు లభించిందని భావిస్తున్నాను అన్నారు. రేపు సాయంత్రం నరసరావుపేట లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటాను అని వెల్లడించారు. వైయస్ జగన్ వల్లే పదవులు పొంది.. జంగా కృష్ణమూర్తి చేసిన వ్యాఖ్యలు బాధను కలిగించాయని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.. నాలుగున్నర ఏళ్లు వైయస్ జగన్ దేవుడు ఇలా కనిపించారు.. వైయస్ జగన్ వల్లే పదవులు పొంది ఎదుగుతారు.. పార్టీని వీడేటప్పుడు మాత్రం అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు. వైయస్ఆర్ సీపీ తరఫున 2014లో జంగా కృష్ణమూర్తికి వైయస్ జగన్ టికెట్ ఇచ్చారు. అక్కడ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు.. సీఎం వైయస్ జగన్ ఏమి చేయలేదో చెప్పాలి? అని నిలదీశారు. నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేయమని కృష్ణ మూర్తి కి కూడా చెప్పారు.. ఆయన కాదన్నప్పుడే నాకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మరోవైపు, టీడీపీ ఎంతమంది బీసీ నేతలకు టికెట్లు ఇచ్చిందో చూడాలి.. ప్రకాశం.. నెల్లూరు.. తిరుపతి జిల్లాల్లో బీసీలలో ఎవరికైనా టీడీపీ టికెట్ ఇచ్చిందా? అని ప్రశ్నించారు. వైయస్ జగన్ ద్వారా బాగా సంపాదించుకొని మళ్లీ ఆయన ను విమర్శించడం ఫ్యాషన్ గా మారిందని ఫైర్ అయ్యారు. చంద్రబాబు పంపించిన స్క్రిప్ట్ ని చదువుతున్నారు అని దుయ్యబట్టారు.. ప్రజలంతా చూస్తున్నారు.. 2024లో మళ్లీ వైయస్ జగన్ను ప్రజలు గెలిపిస్తున్నారని ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ దీమా వ్యక్తం చేశారు.