కూటమి అరాచకాలపై డిజిటల్‌ బుక్‌లో ఫిర్యాదు చేయండి

ముండ్లమూరు మండలంలో డిజిటల్‌ బుక్‌ పోస్టర్‌ ఆవిష్కరణ

ప్ర‌కాశం జిల్లా: అధికార మదంతో కూటమి నాయకులు, కార్యకర్తలు, వారికి వంత పాడుతున్న అధికారులకు బుద్ధి చెప్పేందుకే తమ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి డిజిటల్‌ బుక్‌ను తీసుకొచ్చారని వైయ‌స్ఆర్‌సీపీ ముండ్లమూరు మండలం అధ్యక్షుడు చింత శ్రీనివాస్ రెడ్డి హెచ్చ‌రించారు. ద‌ర్శి ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్‌రెడ్డి ఆదేశాల మేర‌కు మంగ‌ళ‌వారం ముండ్ల‌మూరు మండ‌ల పార్టీ కార్యాల‌యంలో డిజిట‌ల్ బుక్ క్యూఆర్ కోడ్ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెడ్‌ బుక్‌ పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులను, కార్యకర్తలను, సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసులు పెట్టి, జైళ్లకు పంపించి వేధిస్తోందని మండిపడ్డారు. దీనికి కారకులైన వారిని తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే డిజిటల్‌ బుక్‌ ద్వారా చట్టబద్ధంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అక్రమంగా పెట్టిన ప్రతి కేసుకూ ఈ డిజిటల్‌ బుక్‌ సమాధానంగా ఉంటుందని చెప్పారు. కార్యకర్తలకు, ప్రజలకు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సులువుగా సమాచారం అందించేందుకే డిజిటల్‌ బుక్‌ పెట్టామని తెలిపారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న అధికారులపై భవిష్యత్తులో చర్యలు తప్పవని హెచ్చరించారు. పాలకుల ఆదేశాలతో పార్టీ శ్రేణులను ఇబ్బంది పెట్టేలా చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తే భవిష్యత్తులో ఎక్కడున్నా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. బాధితులు తాము ఎదుర్కొన్న ఇబ్బందులను డీబీ.డబ్ల్యూఈవైయ‌స్ఆర్‌సీపీ.కామ్‌ అనే వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చన్నారు. 040–49171718 నంబర్‌కు కాల్‌ చేసి కూడా తెలపవచ్చని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మేడికొండ జయంతి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూది దేవర అంజయ్య, నియోజకవర్గం రైతు విభాగం అధ్యక్షుడు బంక నాగిరెడ్డి, పంచాయతీరాజ్ అధ్యక్షుడు బిజ్జం కృష్ణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పుచ్చా రవీంద్రారెడ్డి , ఉలగల్లు మాజీ సర్పంచ్ గొంది అప్పి రెడ్డి, బూత్ కమిటీ అధ్యక్షులు బిక్షాల రెడ్డి  త‌దిత‌రులు పాల్గొన్నారు.

Back to Top