రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
నవరత్నాలు అందరికీ అందించడమే మా లక్ష్యం
30 Nov 2019 2:23 PM
డిప్యూటీ సీఎం నారాయణస్వామి
విజయవాడ: నవరత్నాలు అందరికీ అందించడమే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. ఎన్నికల ముందు రెండు పేజీల మేనిఫెస్టో తయారు చేసి ప్రజల వద్దకు వచ్చామని, ఆ మేనిఫెస్టోను పవిత్రగ్రంథంలా భావించి ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ అమలు చేస్తున్నారన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేస్తున్నారన్నారు. ఆరు నెలల పాలనలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. కుటుంబాలు సంతోషంగా ఉండాలని దశలవారి మద్యపాన నిషేధాన్ని తీసుకువచ్చారన్నారు. ఇప్పటికే 20 శాతం వైన్షాపులను తగ్గించారని, నూతన బార్ల పాలసీ ద్వారా త్వరలో 40 శాతం బార్లను కూడా తగ్గిస్తున్నట్లు వివరించారు. బలహీనవర్గాలు అభివృద్ధి చెందాలంటే ఇంగ్లిష్ విద్య అవసరమన్నారు.