జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా చంద్రబాబుకు బుద్ధిరాలేదు
28 Mar 2023 2:21 PM
డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఫైర్
విజయవాడ: ఎల్లో మీడియా, చంద్రబాబు, దత్తపుత్రుడు కలిసి ప్రభుత్వంపై, సీఎం వైయస్ జగన్పై బురదజల్లుతున్నారని డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా విషపురాతలు రాయిస్తున్నాడని, ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాలనకు అడ్డంకులు సృష్టించడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నాడని మండిపడ్డారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేసుకొని, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నాడు కాబట్టే టీడీపీని ప్రజలు తిరస్కరించారన్నారు. ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా చంద్రబాబుకు, టీడీపీ నేతలకు బుద్ధిరాలేదని, వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీకి గుణపాఠం తప్పదన్నారు.