వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన గ్రేటర్‌ విశాఖ కౌన్సిలర్లు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని తాడేప‌ల్లిలోని త‌న‌ క్యాంప్‌ ఆఫీస్‌లో గ్రేటర్‌ విశాఖ వైయ‌స్‌ఆర్‌సీపీ కౌన్సిలర్లు క‌లిశారు. ఈ భేటీలో వైయ‌స్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, విశాఖ మేయర్‌ గొలగాని వెంకట హరికుమారి, పార్టీ నాయకులు  తిప్పల నాగిరెడ్డి,  అదీప్‌ రాజ్, కోలా గురువులు,  కేకే రాజు, పలువురు ఇతర నేతలు పాల్గొన్నారు.

Back to Top