అమరావతిః ఏపీ కేబినెట్ తొలి సమావేశం కొనసాగుతుంది. ఈ సమావేశంలో ప్రధానంగా అజెండాలోని అంశాలు, సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణా స్వీకారం రోజున చేసిన ప్రకటనలు,మరో 8 మంది అంశాలపై చర్చ జరుగుతుంది. దశలవారీగా పెన్షన్ల పెంపుపై కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది.ఆశా వర్కర్ల జీతాల పెంపుపై చర్చించనున్నారు. పారిశుద్ధ కార్మికులు,హోంగార్డుల జీతాల పెంపుపై చర్చ జరపనున్నారు.ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనంపై చర్చించనున్నారు.సీపీఎస్పై రద్దు, ఉద్యోగుల 27 శాతం ఐఆర్ అమలుపై చర్చించనున్నారు.