తాడేపల్లి: ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ట్రిపుల్ ఐటీలు, ఏయూ, ఎస్వీ వర్సిటీలపై సీఎం సమీక్షిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్,గుల్జార్, ఏపీఎస్ఈహెచ్ఈ చైర్మన్ కే.హేమచంద్రారెడ్డి, ఆర్జియూకేటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే.సి.రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.