‘దిశ’పై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: దిశ యాక్ట్‌పై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దిశ పోలీస్‌ స్టేషన్ల నిర్వహణ, నేరాలు, అదే విధంగా దిశ యాప్‌ నిర్వహణ వంటి అంశాలపై సీఎం సమీక్షించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, దిశ స్పెషల్‌ ఆఫీసర్లు కృతికా శుక్లా, దీపికా పాటిల్,  మహిళా, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్‌ అనురాధ, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్నితో పాటు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. 
 

Back to Top