27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులు
కోవిడ్ ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఉండాలి
07 Apr 2020 2:24 PM
హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్గా సర్వే
అకాలవర్షం, ఈదురుగాలులతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
కరోనా నియంత్రణ సమీక్షలో అధికారులకు సీఎం వైయస్ జగన్ ఆదేశం
తాడేపల్లి: హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్గా సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కరోనా నివారణ చర్యలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ జవహర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, ల్యాబ్ సౌకర్యాలు, ఆస్పత్రుల్లో ఐసోలేషన్ బెడ్స్ పెంపుపై చర్చించారు. అనంతరం సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. హాట్స్పాట్లుగా గుర్తించిన ప్రాంతాల్లో ర్యాండమ్ సర్వే నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. క్వారంటైన్ క్యాంపుల్లో అన్ని సదుపాయాలు ఉండాలన్నారు. కోవిడ్ ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎస్ఓపీ ప్రమాణాలను పాటించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
అకాల వర్షాలు, ఈదురుగాలులకు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయ పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలన్నారు. అదే విధంగా రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.