అకాల వర్షాలపై సీఎంఓ అధికారులతో సీఎం వైయస్ జగన్ స‌మీక్ష 

పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టాల‌ని ఆదేశం

తాడేప‌ల్లి: రాష్ట్రంలో రెండ్రోజులుగా కురుస్తున్న‌ అకాల వర్షాలపై ముఖ్య‌మంత్రి వైయస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి సీఎం కార్యాల‌య‌ అధికారులతో స‌మీక్ష నిర్వ‌హించారు. అకాల వర్షాలు, వివిధ ప్రాంతాల్లో పంటలకు జరిగిన నష్టంపై అధికారులు ప్రాథమిక సమాచారాన్ని అందించారు. పంట నష్టపరిహారంపై వెంటనే ఎన్యుమరేషన్‌ మొదలుపెట్టాల‌ని అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. వారం రోజుల్లో ఈ ఎన్యుమరేషన్‌ పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్లుకు ఆదేశాలు జారీచేయాలన్నారు. ఎన్యుమరేషన్‌ పూర్తయ్యాక రైతులను ఆదుకునేందుకు అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్నారు. భారీవర్షాల వల్ల ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు కలెక్టర్లు పరిస్థితిని అంచనా వేసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆదేశించారు.

Back to Top