బెల్ట్‌ షాపులు తొలగించాలని సీఎం ఆదేశం

విజయవాడ: రాష్ట్రంలోని బెల్ట్‌ షాపులను తొలగించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించారు. శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజలపై భారం పడకుండా ఆదాయ మార్గాలు చూడాలని అధికారులకు సూచించారు. దశలవారీగా మద్యపాన నిషేధానికి మార్గాలు అన్వేషించాలన్నారు. మరోసారి మద్యపాన నిషేధంపై పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. 
 

Back to Top