చంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండా
వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం
02 Dec 2021 3:19 PM
సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి
పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుంది
వైయస్ఆర్ జిల్లా: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా చనిపోయిన కుటుంబాల్లో ఒకరికి ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైయస్ఆర్ జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించారు. రాజంపేట మండలం మందపల్లి, పులపుత్తూరులో వరద బాధితులను సీఎం వైయస్ జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో సీఎం వైయస్ జగన్ ముఖాముఖి నిర్వహించి..వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వరద సహాయ కార్యక్రమాల్లో అధికారులు అద్భుతంగా పని చేశారని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అభినందించారు. పొదుపు మహిళల రుణాలపై ఏడాది వడ్డీ ప్రభుత్వమే చెల్లిస్తుందని సీఎం పేర్కొన్నారు.