ఆరోగ్య‌శ్రీ 2.0 ప్రారంభం

ఆరోగ్య‌శ్రీ‌లో కొత్త‌గా పెంచిన 3255 ప్రోసిజ‌ర్లు ప్రారంభించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ఆరోగ్యశ్రీలో కొత్తగా పెంచిన 3255 చికిత్స విధానాలను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కంప్యూటర్‌లో బటన్ నొక్కి ప్రారంభించారు. శుక్ర‌వారం వైద్య ఆరోగ్యశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టి కృష్ణబాబు, ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ డైరెక్టర్‌ జె నివాస్, ఏపీ వైద్యవిధానపరిషత్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి వినోద్‌ కుమార్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈఓ ఎంఎన్‌ హరీంద్ర ప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ డీజీ(డ్రగ్స్‌) రవిశంకర్‌ ఇతర ఉన్నతాధికారులు హాజరు.

తాజా వీడియోలు

Back to Top