ఆడబిడ్డల రక్షణలో అందరికన్నా మిన్నగా..

21వ శ‌తాబ్ద‌పు ఆధునిక భార‌తీయ మ‌హిళ ఏపీలో అవ‌త‌రించేలా నిర్ణ‌యాలు

అక్క‌చెల్లెమ్మ‌ల‌కు, అవ్వ‌ల‌కు మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు: సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: గర్భస్త శిశువు నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. ఆడ‌బిడ్డ‌ల ర‌క్ష‌ణ కోసం అంద‌రిక‌న్నా మిన్న‌గా అడుగులు ముందుకువేశాం అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అక్క‌చెల్లెమ్మ‌ల‌కు, అవ్వ‌ల‌కు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ శుభాకాంక్ష‌లు తెలిపారు.  మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్రను మహిళలు పోషిస్తున్నారన్నారు. 

‘‘మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం. 2019లో అధికారం చేపట్టిన నాటి నుంచి మన ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ సాధికారతలపై దేశంలోని మరే ప్రభుత్వమూ పెట్టనంతగా దృష్టి పెట్టింది. జగనన్న అమ్మ ఒడి, వైయ‌స్ఆర్‌ ఆసరా, వైయ‌స్ఆర్ చేయూత, 30 లక్షల ఇళ్ల పట్టాలు-22 లక్షల ఇళ్ల నిర్మాణం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైయ‌స్ఆర్ సంపూర్ణ పోషణ వంటి పథకాలతో గర్భస్త శిశువు నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. వారి రక్షణ, భద్రతను దృష్టిలో ఉంచుకుని దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లతో ఆడబిడ్డల రక్షణలో అందరికన్నా మిన్నగా అడుగులు ముందుకు వేశాం’’ అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అన్నారు.

‘‘21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే అవతరించేలా నిర్ణయాలు తీసుకున్నాం. రాజకీయ పదవుల్లో కూడా చట్టాలు చేసి మరీ సగభాగం ఇచ్చింది మన ప్రభుత్వమే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబం, మొత్తం సమాజం ఆడబిడ్డల పట్ల మరింత గౌరవం, శ్రద్ధ కనబర్చేలా నిర్ణయాలు తీసుకోవాలి’’ అని సీఎం వైయ‌స్‌ జగన్‌ పిలుపునిచ్చారు.

Back to Top