సివిల్స్‌ ర్యాంకర్లకు సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు

తాడేపల్లి: సివిల్స్‌లో ర్యాంకులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. 15వ ర్యాంక్‌ సాధించిన యశ్వంత్‌తో సహా తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సీఎం వైయస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. పి.సాహిత్య, శృతి రాజ్యలక్ష్మి, రవికుమార్, కిరణ్మయి, పానిగ్ర‌హి కార్తీక్, సుధీర్‌ కుమార్‌రెడ్డి, శైలజ, శివానందం, ఏ.నరేష్‌లను సీఎం వైయస్‌ జగన్‌ అభినందించారు. 

Back to Top