వ‌రుస‌గా రెండోసారి.. జాతీయ అవార్డు సాధించిన ఇంధ‌న శాఖ‌

అధికారుల‌ను అభినందించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేప‌ల్లి: ఇంధన శాఖ అధికారులను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అభినందించారు. ప్రతిష్టాత్మక నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు- 2023ను ఆంధ్ర‌రాష్ట్రం ద‌క్కించుకుంది. వ‌రుస‌గా రెండేళ్ల‌లో రెండుసార్లు అత్యుత్తమ ఇంధన సామర్థ్య‌ అవార్డును ద‌క్కించుకొని రికార్డు సృష్టించింది. ఇటీవ‌ల న్యూఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి శ్రీ‌మ‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా ఇంధ‌న శాఖ అధికారులు ఈ అవార్డును అందుకున్నారు. 

తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను కలిసిన ఇంధ‌న శాఖ అధికారులు అవార్డు అంద‌జేసి, వివరాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినందించారు. ముఖ్యమంత్రిని క‌లిసిన వారిలో ఇంధన శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కె. విజయానంద్, ఏపీ జెన్‌కో ఎండీ కె.వి.ఎన్‌ చక్రధర్‌ బాబు,ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ (విజిలెన్స్, సెక్యూరిటీ) బి.మల్లారెడ్డి, ఏపీఎస్‌ఈసీఎం చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బీఏవీపీ కుమారరెడ్డి ఉన్నారు.

Back to Top