ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి
04 Jul 2022 8:43 PM
ప్రధాని మోడీకి సీఎం వైయస్ జగన్ వినతి
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రం
తాడేపల్లి: మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ అనంతరం గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీకి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ ప్రధానమంత్రి మోడీకి సీఎం వైయస్ జగన్ వినతిపత్రం అందజేశారు. అదే విధంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వినతిపత్రంలో పొందుపరిచారు.
వినతిపత్రంలోని ముఖ్యమైన అంశాలు
- రీసోర్సు గ్యాప్ గ్రాంటు అంశాన్ని ప్రస్తావిస్తూ.. రూ.34,125.5 కోట్ల రూపాయలను రీసోర్స్ గ్యాప్ కింద గ్రాంటుగా ఇవ్వాలి.
- తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాలి.
- పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపండి.
- జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్ విషయంలో హేతుబద్ధత లేదు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోంది. దానిని సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలి.
- రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలి.
- భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్లు మంజూరుచేయాలి.
- ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని ప్రధాన మంత్రి నరేంద్రమోడీని సీఎం వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు.