సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులువైయస్ఆర్ సీపీలో చేరిన గమ్మిని సుబ్బారావుగోదావరిలో జనజాతరఅట్టహాసంగా వైయస్ఆర్సీపీ అభ్యర్థుల నామినేషన్రాజోలులో జనసేనకు భారీ షాక్భయపడొద్దమ్మా.. నేనున్నా..అభిమానం.. ఆకాశమంత 17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..!
చిత్తూరులో బరితెగించిన టీడీపీ నేతలు
15 Feb 2021 2:03 PM
చిత్తూరు: జిల్లాలో టీడీపీ నేతలు కత్తులతో వీరంగం సృష్టించారు. వైయస్సార్సీపీ కార్యకర్తల కుటుంబాల మీద కత్తులతో దాడులు చేశారు. ఈ ఘటన కేవీ పల్లి మండలం తిమ్మాపురంలో జరిగింది. టీడీపీ నేతల దాడిలో వైయస్సార్సీపీకి చెందిన 10 మంది గాయపడ్డారు. దారుణం ఏంటంటే వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.
వివరాలు.. పంచాయితీ ఎన్నికల్లో తిమ్మాపురంలో టీడీపీ మద్దతుదారు సర్పంచ్గా గెలిచాడు. దాంతో బరితెగించిన తెలుగుదేశం నేతలు వైయస్సార్సీపీ శ్రేణుల కుటుంబాలను టార్గెట్ చేశారు. ఈ క్రమంలో టీడీపీకి చెందిన ద్వారక, ఆనంద్లతో పాటు మరో 50 మంది ఈ రోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముద్దుకృష్ణ ఇంటితోపాటు మరో నాలుగు కుటుంబాల మీద దాడులు చేశారు. కత్తులు, ఇనప రాడ్లతో దాడులు చేయడంతో 10 మంది గాయపడ్డారు. ప్రస్తుతం వీరందరిని పీలేరు ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.