ఘనంగా అంబేద్కర్‌ జయంతి వేడుకలు

 అమరావతి : భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతి వేడుకలు రాష్ట్రంలో ఘనంగా జరిగాయి. అంబేద్కర్‌ జయంతి వేడుకలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ఏపీ అంతటా ఘనంగా నిర్వహించాయి. వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. వైఎస్‌ జగన్‌తోపాటు పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు అంబేద్కర్‌కు ఘన నివాళులు అర్పించారు. 

Back to Top