నారా లోకేశ్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి 

వైయ‌స్ఆర్ జిల్లా:   విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకున్న కమిటీలో తాను ఉన్న‌ట్లు  టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి  ఖండించారు. తాను స్టీల్ ప్లాంట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నానంటూ లోకేశ్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని వివరించారు. తాను ఏ కమిటీలో సభ్యుడిగా లేనని స్పష్టం చేశారు. లోకేశ్ తనపై చేసిన ఆరోపణలు హాస్యాస్పదం అని కొట్టిపారేశారు.

మంత్రి పెద్దిరెడ్డిపైనా, ప్రభుత్వ సలహాదారు సజ్జలపైనా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని వైయ‌స్ అవినాశ్ రెడ్డి హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటికే సీఎం వైయ‌స్‌ జగన్ కేంద్రానికి లేఖ రాశారని వెల్లడించారు.

Back to Top