దివంగత నేతలకు అసెంబ్లీ సంతాపం

అమరావతి: దివంగత ఎమ్మెల్యేలకు ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. ఇటీవల మరణించిన శత్రుచర్ల చంద్రశేఖరరాజు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పులపర్తి నారాయణమూర్తి, జేఆర్‌ పుష్పరాజ్,నల్లమిల్లి ములారెడ్డి మృతి పట్ల స‌భ సంతాపం తెలిపింది. ఈ మేరకు సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. శోకసంద్రంలో ఉన్న కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Back to Top