వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఫైబర్ గ్రిడ్ స్కామ్లో లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు
21 Sep 2020 2:14 PM
అమరావతిలోనూ లక్ష కోట్ల అవినీతి జరిగింది
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా
విజయవాడ: ఫైబర్ గ్రిడ్ స్కామ్లో నారా లోకేష్ అడ్డంగా దొరికిపోయాడని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కే రోజా అన్నారు. తండ్రి శాఖలో ఫైల్పై లోకేష్ ఎందుకు సంతకం పెట్టారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడారు. ఫైబర్ గ్రిడ్ స్కామ్పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అమరావతిలోనూ చంద్రబాబు, లోకేష్ భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. అమరావతిలో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. టీడీపీ నేతలు, ఓ సామాజికవర్గం వాళ్లే అమరావతిలో భూములు ఎలా కొనగలిగారని ప్రశ్నించారు. అమరావతి చంద్రబాబుకు ఏటీఎం అని ప్రధాని మోడీనే చెప్పారని గుర్తుచేశారు. అందుకే ప్రధానిని సీబీఐ విచారణ వేయాలని కోరుతున్నామన్నారు.