చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
నేడు కేబినెట్ సమావేశం
05 Nov 2020 9:53 AM
సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయం ఒకటో బ్లాక్లో నేటి ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి పలు నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. మంత్రిమండలి సమావేశంలో ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా చేసేందుకు ఇటీవల ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేతులు మీదుగా ప్రారంభమైన ‘జగనన్న వైయస్ఆర్ బడుగు వికాసం’ పథకానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదేవిధంగా నూతన ఇసుక విధానంపై, ఎస్ఐపీబీ ఆమోదం తెలిపిన పారిశ్రామిక ప్రాజెక్టులపై, మచిలీపట్నం పోర్టుకు సంబంధించి డీపీఆర్పై కేబినెట్లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.