సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు

తాడేప‌ల్లి: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్, సర్వే ఉద్యోగుల సంఘం, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల సంఘం ప్రతినిధులు తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ సర్వే శాఖలో ప్రమోషన్లు కల్పించేలా డిపార్ట్‌మెంట్‌ను రీఆర్గనైజ్‌ చేసి 410 పోస్టులు అప్‌గ్రేడ్‌ ప్రమోషన్‌ అవకాశాలు కల్పించినందుకు సర్వే శాఖ ఉద్యోగులు ఏ.పి. గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామి రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సీఎంను క‌లిసిన వారిలో సర్వే ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, కార్యదర్శి చారి, వెంకట రమణారెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ సంఘం అధ్యక్ష కార్యదర్శులు అంజన్‌ రెడ్డి, అంకమరావు, భార్గవ్, కిశోర్‌ తదితరులు ఉన్నారు.

Back to Top