ఆర్డీటీ పరిరక్షణకు ప్రజా ఉద్యమం

అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు అనంత  వెంక‌ట్రామిరెడ్డి 

అనంతపురం  :  ఆర్డీటీ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌జా ఉద్య‌మం చేప‌డుతామ‌ని అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు అనంత  వెంక‌ట్రామిరెడ్డి హెచ్చ‌రించారు. గురువారం అనంతపురంలోని వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో  అనంత వెంకటరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

ఆయ‌న ఏమ‌న్నారంటే..

  • ఆర్డీటీ సంస్థ రాజకీయాలు, మతాలు, కులాలకు అతీతంగా స్వచ్ఛందంగా సేవలు అందిస్తోంది. 
  • దేశంలోనే అత్యంత వెనుకబడిన అనంతపురం జిల్లాతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఆర్డీటీ సేవలు ఎనలేనివి.
  • విద్య, వైద్యం, క్రీడ రంగాలతో పాటు పేదరికం రూపుమాపేందుకు ఆర్డీటీ కృషి చేస్తోంది. 
  • ప్రభుత్వానికి సమాంతరంగా సేవలు అందిస్తున్న ఆర్డీటీ  కేంద్ర ప్రభుత్వ తీరుతో ఉనికి కోల్పోయే పరిస్థితికి వ‌చ్చింది. 
  • ఆర్డీటీకి మతం బూచి చూపి దేశం నుంచి వెళ్లిపోయేలా చూస్తున్నారు. విదేశీ నిధులు రాకుండా అడ్డుకుని ఆర్డీటీ సేవలు అందించలేని పరిస్థితికి తెచ్చారు. 
  • ఆర్డీటీ మూతపడుతుందని ప్రజల్లో భయాందోళన ఉంది. 
  • ఎంతో మంది నిరుపేదలకు ఆర్డీటీ చేయూత ఇచ్చింది. మహిళా సాధికారతకు కృషి చేసింది. 
  • బత్తలపల్లి, కణేకల్లు, కళ్యాణదుర్గంలో ఆర్డీటీ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి.  
  • బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ఏటా 8.50 లక్షల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. 
  • కోవిడ్‌ వంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఆర్డీటీ సంస్థ మార్గదర్శకంగా నిలిచింది. ఎంతో ఎఫెక్టివ్‌గా పని చేసింది. 
  • ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. 
  • ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయా పార్టీలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదు. 
  • ఆర్డీటీ సంస్థ సేవలు, ఆవశ్యకతపై ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశా. జిల్లా ప్ర‌జాప్రతినిధులు చొరవ చూపాలని కోరాం.  సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తీసుకురావాలని విన్నవించా. అయినా ఫలితం శూన్యం.
  • ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ కూడా గతంలో ఆర్డీటీతో చర్చించారు. అయినా ఫలితం లేకపోయింది. 
  • ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలోగా ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ కాకుంటే ఆర్డీటీ మూసివేసే పరిస్థితి వస్తుంది.
  • ఆర్డీటీ విషయంలో ప్రజల్లో ఎంత ఆందోళన ఉందో ఇటీవల అనంతపురంలో జరిగిన నిరసనే నిదర్శనం.
  • గత ఎన్నికల సమయంలో నారా లోకేష్‌ పాదయాత్ర చేస్తూ ఆర్డీటీ ప్రతినిధులను కలిసి ఆర్డీటీకి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలైనా పట్టించుకోలేదు.
  • కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. చంద్రబాబు మద్దతు లేకపోతే ఎన్డీయే అధికారంలో ఉండదని టీడీపీ నాయకులే చెబుతున్నారు. చంద్రబాబుకు సొంత ప్రయోజనాలు తప్పితే ఆర్డీటీ విషయం పట్టడం లేదా?
  • ఆర్డీటీపై లక్షలాది మంది ఆధారపడి ఉన్నారన్న విషయం ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు?
  • ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌ చేయించే విషయంలో సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపాలి
  • ఆర్డీటీ పరిరక్షణ కోసం గతంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తలారి రంగయ్య నాయకత్వంలో బైక్‌ ర్యాలీ, పాదయాత్రలు చేశాం. 
  • ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు సీఎం చంద్రబాబుతో మాట్లాడి ఆర్డీటీ సేవలు కొనసాగేలా చూడాలి. 
  • అవసరమైతే అసెంబ్లీలో తీర్మాణం చేసి కేంద్రానికి పంపండి
  • కేంద్రం కూడా ఆర్డీటీ సేవలు గుర్తించాలని కోరుతున్నాం. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తాం. 
  • ప్రభుత్వాలు దిగిరాకపోతే అందరినీ కలుపుకుని ప్రజా ఉద్యమం నిర్మించి ప్రభుత్వం మెడలు వంచుతాం. 

ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం:

  • విద్య, వైద్యం అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రభుత్వాలే నిర్వహించాలి.  
  • వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో విద్య, వైద్యానికి పెద్దపీట వేశాం. 
  • వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో 17 మెడికల్‌ కళాశాలలు తెచ్చాం. ఐదు కళాశాలలను పూర్తి చేసి 2023–2024 విద్యా సంవత్సరంలోనే తరగతులు ప్రారంభించాం. 
  • చంద్రబాబు తన వాళ్లకు దోచిపెట్టడానికే రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణ 
  • అమరావతి కోసం అప్పు తెచ్చి లక్ష కోట్లు పెడుతున్నారు. రైతుల నుంచి భూములు లాక్కుంటున్నారు. రాజధాని కూడా పీపీపీ మోడల్‌లో అభివృద్ధి చేస్తారా? 
  • మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెనుకొండలో నిర్మాణంలో ఉన్న మెడికల్‌ కళాశాల వద్ద శుక్రవారం (ఈనెల 19వ తేదీ) నిరసన తెలియజేస్తాం. 

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్ దుర్మార్గం 

  • తాడిపత్రిలో దౌర్జన్యం చేసే జేసీ ప్రభాకర్‌ రెడ్డిని ఎందుకు అడ్డుకోరు?
  • సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని తాడిపత్రిలోకి అనుమతించాలి 
  • ప్రతి సారి అడ్డంకులు సృష్టించడం సరికాదు 
  • తాడిపత్రిలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. 
  • ప్రభుత్వానికి సమాంతరంగా తాడిపత్రిలో మరో వ్యవస్థ పనిచేస్తోంది. 
  • కలెక్టర్లు, ఎస్పీలతో ఇటీవల సమీక్షలు చేసిన చంద్రబాబు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని సూచించారు. మరి తాడిపత్రిలో ఏం జరుగుతోందో చంద్రబాబుకు తెలియదా? 
  • తాడిపత్రిలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై న్యాయపరంగా ముందుకెళ్తాం.
Back to Top