విజయవాడ: జనాబ్అబుల్ కలాం ఆజాద్ 132వ జయంతి ఘనంగా నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. జనాబ్అబుల్ కలాం ఆజాద్ జయంతిరోజు విద్యాదినోత్సవాన్ని, మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. డాక్టర్ అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారానికి జాబితా సిద్ధమైనట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి హాజరు కానున్నట్టు తెలిపారు. Read Also: బీజేపీతో పొత్తు కోసం బాబు వెంపర్లాట