తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు నగరానికి చెందిన పలువురిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతో గుంటూరు మాజీ మేయర్ కావటి మనోహర్ నాయుడుతో పాటు మర్రి అంజలి, యాట్ల రవికుమార్ అనే ఇద్దరు కార్పొరేటర్లను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.