బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
మూడు నెలలకోసారి విద్యుత్ బాదుడు
27 Jun 2016 6:32 PM
ప్రజల్ని ఛార్జీల రూపంలో బాదాలంటే చంద్రబాబు ప్రభుత్వం కొత్త కొత్త మార్గాలు
వెదకుతూనే ఉంటుంది. గత కాలంలో 9 సంవత్సరాలు పరిపాలన చేస్తే 10 సార్లు విద్యుత్
ఛార్జీలు పెంచిన ఘనత చంద్రబాబుది. ఇప్పుడు మళ్లీ తన రికార్డుల్ని తానే
తిరగరాసుకొనే పనిలో ఆయన బిజీగా ఉన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రవేశ పెట్టిన ఉదయ్
స్కీమ్ ను మార్గంగా చేసుకోబోతున్నారు.
ఈ విధానం ప్రకారం చూస్తే మూడు నెలలకోసారి డిస్కమ్ల లాభనష్టాలను సమీక్షించడం
తప్పనిసరి. ఈ కాల వ్యవధిలో నష్టాలను చవిచూస్తే, దాన్ని వెంటనే రాబట్టాలి. అన్ని రకాల నష్టాలను
అప్పటికప్పుడే లెక్కించి వినియోగదారుల నుంచి రాబట్టు వీలుందని అధికారవర్గాలు
చెబుతున్నాయి. తదుపరి మూడు నెలల కాలంలో వచ్చే విద్యుత్ బిల్లుల్లో ఈ భారం పడుతుందని
వారు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ విద్యుత్ కొనుగోళ్లకు ప్రభుత్వం ఎక్కువ మొత్తం
వెచ్చించినా దాన్ని మూడు నెలల్లోనే ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయాలని
నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి.
దీని ప్రకారం చూస్తే విద్యుత్ వినియోగదారులపై
మూడు నెలలకు ఒకసారి భారం పడే అవకాశం ఉంది. నష్టాల
భర్తీని పూడ్చుకోవడానికి రుణ విముక్తి పొందడానికి వాటికున్న రూ. 11వేల కోట్ల అప్పుల్లో 75 శాతానికి రాష్ట్ర ప్రభుత్వం బాండ్లు విడుదల
చేస్తుంది. విద్యుత్ పంపిణీ సంస్థలపై తిరిగి రుణభారం పడకూడదనేది ఉదయ్ పథకం
ముఖ్యోద్ధేశం. ఏది ఏమైనా ప్రజల్ని బాదేందుకు అనువుగా ఉన్న
పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం స్వీకరించటం గమనార్హం.