స్పీకర్ : శ్రీమతి రోజ - మే 19,2012

ఈ రోజు సాక్షి అంటే ఈ ప్రభుత్వం ఎంతగా భమపడుతుందో వారు ఇచ్చే జీఓలు చూస్తే అర్ధమవుతుంది.ఈ నెల 8వతతేది సాక్షి ఖాతాల స్ధంబనకి సీబీఐ తెగించింది. ఆ తర్వాత రాష్ట్ర హైకోర్టు 17 వతేదినా ఈ జీఓను స్టేచేస్తు ఉత్తర్వులు ఇచ్చింది.

ఈ జీఓ రాష్ట్ర చరిత్రలో ఏనాడు కనీవినీ ఎరుగని దుర్మార్గమైన విదానంలో తయారైంది.ఈ జీఒలో ఏముందోవెళ్ళడించకుండా  కాన్పిడెన్షియల్‌ అంటూ తాను చేసిన సిగ్గుమాలిన పనిని ప్రభుత్వం చెప్పుకోలేని స్ధితిలో ఉంది.
ఈ జీఒతో బాటు సాక్షి ప్రకటణలు ఇవ్వకుండా జారీ చేసిన జీఓ ఇచ్చే నైతికమైన, చట్టపరమైన అధికారం కిరణ్‌కుమార్‌ రెడ్డి క్యాబినెట్‌కు ఉందా? అని మేము అడుగుతున్నాం. సీబీఐ వారు చెబుతున్నట్టుగా వివాదస్పదమైన ఆ 26 జీఒలా వల్లా క్యిట్‌ ప్రోకో వల్లా జగన్‌గారి బిజినెస్‌లో డబ్బులు పెట్టారని చెబుతున్నారొ అది జరిగిందా లేదా అని అలోచించకుండా సీబీఐ ఓన్‌సైడ్‌గా జగన్‌మోహన్‌రెడ్డి దోషి అనిచెప్పి ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు.ఇది ప్రజలు గమనిస్తున్నారు. ఈ రోజు జీఓ వస్తుంది కాబట్టి సబితా ఇంధ్రారెడ్డిగారిని నిన్ననే విచారించారు. ఎందుకంటే ప్రజలు అడుగుతారుకాబట్టి. ఈ 26 జీఓల విషయంలో ఎవరినైతే కోర్టు విచారించమని మంత్రులను తప్పు పట్టిందో అందులో సబితా ఇంద్రారెడ్డి ఒకరు అలాంటి సబితా ఇంద్రారెడ్డి గారు సాక్షి ఆస్తులను అటాచ్‌ చేయమని ఫైల్‌ మీద సైన్‌ పెట్టడం ఎంత వరకు సమంజసం.
ఇది కేవలం ఒక ప్రజానాయకుడిని అణగదోక్కాలని ప్రజలవాయిస్‌ను వినిపిస్తున్నా సాక్షి గోంతు నోక్కితే జగన్‌మోహన్‌రెడ్డి వాయిస్‌ ప్రజల్లోకి వెళ్ళకుండా ఆపగలిగితే కాంగ్రెస్‌ పార్టీకి లబ్ధిచెందుతున్నది అన్నా ఓకే ఒక దురుద్దేశంతో జరుగుతున్నా చర్యగా మేము భావిస్తున్నాం. తప్పు జరగలేదని మేము అంటున్నాం, తప్పు జరిగింది అని సీబీఐ అంటుంది,తప్పు జరిగితే ముందు ఆ జీఓలు విడుదల చేసిన మంత్రులను ఎందుకు విచారించడంలేదు. క్యిట్‌ ప్రోకో జరిగిందాలేదా ప్రూవ్‌చేయాలి .వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న నాయకులను భయపెట్టాడానికి సాక్షిలో పనిచేస్తున్నా ఉద్యోగులను అబద్రతాబావంలో పడవేయడానికి ప్రజల్లో జగన్‌మోహన్‌రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని దూరంచేసి లభ్ధి పోందాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రయత్నంచేస్తుంది. అలాంటివి ఎక్కడా కూడ జరగవుఅని మేము కచ్చితంగా చెప్పగలము. 

2009లో తెలుగుదేశం పార్టీ నాయకులు రాజశేఖరరెడ్డి గారు అవినీతిపరుడు అంటే జలయజ్ఞంకాదు, దనయజ్ఞం అని చెప్పి ఎన్ని ఆరోపణలు చేసినా కూడ ప్రజలు రాజశేఖరరెడ్డి గారు నిజమైన ప్రజానాయకుడు అని నమ్మి రాజశేఖరరెడ్డి గారికి పట్టం కట్టారు. వీరు చేసే పనుల వల్లా ప్రజాబిమానం పోందుతాం తప్పా వీళ్ళు అశించింది జరగదు. సీబీఐకి ఒక డైరక్షన్‌ఇచ్చి కేవలం జగన్‌మోహన్‌రెెడ్డి గారి చుట్టు కధఅల్లి జగన్‌పక్కన ఉన్న వారిచేత జగన్‌మోహన్‌రెడ్డి ముద్దాయి అని చెప్పించిఅరెస్ట్‌చేయాలని అనుకుంటున్నారు.ఇవన్ని జరిగిపనులుకాదు తెలుసుకోవాలి..కొన్ని చానల్స్‌ వారు వారి మనసులోని అభిప్రాయాలను చెబుతున్నారు.అరెస్ట్‌ అయితే బావుండు, అరెస్ట్‌ అవుతారు. అని కొన్ని  చానల్స్‌తమ ఉహలను కధనాలగా ప్రసారంచేస్తున్నారు.
Back to Top